News August 31, 2024
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ సీఎం

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, కావున అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుండి బయటకు రావాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.
Similar News
News February 17, 2025
KMM: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
News February 17, 2025
పెట్రోల్ పోసి నిప్పంటించిన అత్త, మామ.. అల్లుడి మృతి

అల్లుడిపై అత్తింటి వారు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన టేకులపల్లిలో జరిగింది. SI శ్రీకాంత్ వివరాల ప్రకారం.. పాల్వంచ దంతెలబోర్కి చెందిన గౌతమ్ రామచంద్రునిపేటకు చెందిన కావ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత నెల కావ్య పిల్లలతో పుట్టింటికి వచ్చింది. ఈ నెల 2న గౌతమ్ భార్య, పిల్లలను చూసేందుకు పేటకు వచ్చాడు. అత్తింటి వారు గౌతమ్పై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టగా
MGMలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News February 17, 2025
KMM: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.