News March 26, 2025
భారీ శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధం

భారీ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. APR 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇటీవల ఈ రూట్ను గోషామహల్ MLA రాజాసింగ్ పరిశీలించారు. ఈ సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వేలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొని రాముడి విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరామనవమి రోజు ‘జై శ్రీరామ్’ నినాదాలతో HYD హోరెత్తనుంది.
Similar News
News November 20, 2025
HYD: ప్రజా సమస్యలు పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలా?: పద్మారావు గౌడ్

HYDలో ఫార్ములా-ఈ నిర్వహణ తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిందని మాజీ మంత్రి, సికింద్రాబాద్ MLA టి.పద్మారావు గౌడ్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. కేటీఆర్ విజన్తో సాధ్యమైన ఈ గొప్ప కార్యక్రమంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసూయతో తప్పుడు కేసులు పెట్టించడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వారి వైఖరిని బయట పెడుతోందని వ్యాఖ్యానించారు.
News November 20, 2025
HYD: ప్రజా సమస్యలు పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలా?: పద్మారావు గౌడ్

HYDలో ఫార్ములా-ఈ నిర్వహణ తెలంగాణకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిందని మాజీ మంత్రి, సికింద్రాబాద్ MLA టి.పద్మారావు గౌడ్ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. కేటీఆర్ విజన్తో సాధ్యమైన ఈ గొప్ప కార్యక్రమంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసూయతో తప్పుడు కేసులు పెట్టించడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి ప్రతీకార రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వారి వైఖరిని బయట పెడుతోందని వ్యాఖ్యానించారు.
News November 20, 2025
HYD: మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపణలను ఖండిస్తున్నాం: రాంచందర్రావు

ఆపరేషన్ కగార్ విషయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ఖండించారు. HYDలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను కక్షపూరితంగా చంపుతోందంటూ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు. నక్సల్స్ను ‘పేదల కోసం పోరాడిన వారు’ అని చెప్పడం దుర్మార్గం, సిగ్గుచేటని మండిపడ్డారు.


