News March 26, 2025
భారీ శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధం

భారీ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. APR 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇటీవల ఈ రూట్ను గోషామహల్ MLA రాజాసింగ్ పరిశీలించారు. ఈ సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వేలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొని రాముడి విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరామనవమి రోజు ‘జై శ్రీరామ్’ నినాదాలతో HYD హోరెత్తనుంది.
Similar News
News November 23, 2025
11 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

AP: 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కు కళ్యాణం శివశ్రీనివాసరావు, స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఛైల్డ్ లేబర్కు సత్యనారాయణ రాజు, ఉర్దూ అకాడమీకి మౌలానా షిబిలీ, అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్కు విక్రమ్, ఫిషర్మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్కు రామ్ప్రసాద్, స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీకి ముక్తియార్ను నియమించింది.
News November 23, 2025
GHMC: సీసీ రోడ్ల పెండింగ్.. ఈ 3 జోన్లలో అధికం

ఖైరతాబాద్ జోన్లో మొత్తం 506 పనులు పెండింగ్లో ఉన్నాయి. వీటి విలువ రూ.14,042.7 లక్షలు. 27 BT రోడ్ల పనుల్లో కేవలం 4 మాత్రమే పూర్తయ్యాయి!చార్మినార్ జోన్లో 728 పనులు పెండింగ్లో ఉన్నాయి. విలువ రూ.13,556.93 లక్షలు. ఇక్కడ కూడా CC పనుల బకాయి రూ.12,778.78 లక్షలుగా ఉంది. LBనగర్ జోన్లో రూ.11,446.4 లక్షల విలువైన 175 పనులు మిగిలి ఉన్నాయి. <<18363545>>ఈ మూడు జోన్లలో<<>>ని రోడ్ల సమస్యలపై ప్రజాగ్రహం తప్పేలా లేదు.
News November 23, 2025
SRCL: డ్రగ్స్కు దూరంగా ఉందాం: డబ్ల్యూఓ లక్ష్మీరాజం

బాల్యవివాహాలను అరికట్టాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం అన్నారు. శనివారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ‘నశా ముక్త్ భారత్ అభియాన్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వల్ల మెదడు మొద్దుబారడం, కండరాలు పనిచేయకుండా పోవడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయని విద్యార్థులకు వివరించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా సన్మార్గంలో నడవాలని అన్నారు.


