News March 26, 2025
భారీ శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధం

భారీ శోభాయాత్రకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. APR 6న శ్రీరామనవమి సందర్భంగా సీతారాంబాగ్ ఆలయం నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇటీవల ఈ రూట్ను గోషామహల్ MLA రాజాసింగ్ పరిశీలించారు. ఈ సారి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వేలాది మంది ఈ శోభాయాత్రలో పాల్గొని రాముడి విగ్రహాలను ఊరేగిస్తారు. శ్రీరామనవమి రోజు ‘జై శ్రీరామ్’ నినాదాలతో HYD హోరెత్తనుంది.
Similar News
News October 23, 2025
డార్లింగ్ సినిమాల్లో మీ ఫేవరెట్ ఏంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాలపై నెట్టింట చర్చ జరుగుతోంది. ‘ఈశ్వర్’ సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం దిగ్విజయంగా. ఆయన ఇప్పటివరకూ వర్షం, ఛత్రపతి, పౌర్ణమి, బుజ్జిగాడు, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి 1&2, సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఏడీతో సహా మొత్తం 23 సినిమాల్లో నటించారు. వీటిలో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి.
News October 23, 2025
చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

చేవెళ్ల మండలంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మల్కాపూర్ ప్రధాన రహదారి మీద గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు యాలాల మండల వాసులుగా పోలీసులు గుర్తించారు. స్కూటీని ఢీ కొట్టి వెళ్లిన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 23, 2025
పవర్ గేమ్….మాజీ మేయర్ దంపతుల హత్యకు కారణం..!

చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, భర్త మోహన్పై 2015 నవంబర్ 17న ఆమె కార్యాలయంలో దాడి జరిగి అనురాధ మరణించారు. అదే రోజు వెల్లూరు CMCలో చికిత్స పొందుతూ మోహన్ మరణించారు. ఈ హత్య కుటుంబ కలహాలు, తనకు సరైన పవర్ ఇవ్వలేదనే కారణాలతో సొంత మేనమామ, అత్తను చింటూ హత్య చేశారని అప్పటి పోలీస్ అధికారులు నివేదిక సమర్పించారు. ప్రధాన నిందితుడు చింటూ (శ్రీచంద్రశేఖర్) పక్క వ్యూహం ప్రకారం దాడి ప్లాన్ చేశారని ప్రకటించారు.