News March 28, 2025

భార్యను తీసుకురావడానికి వెళ్తూ.. భర్త మృతి

image

భార్యను ఇంటికి తీసుకురావడానికి బైక్ పై వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందిన ఘటన సత్తుపల్లి పట్టణం శివారులో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన మట్ల వెంకటేశ్వరరావు (35) భార్య భవాని సత్తుపల్లిలోని జీవి మాల్‌లో పనిచేస్తుంది. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు వస్తుండగా ఓ పానీపూరి బండిని ఢీకొట్టాడు. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News October 17, 2025

నేడు విద్యుత్ ఉద్యోగులతో మరోసారి చర్చలు

image

AP: ప్రధాని పర్యటన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు <<18008727>>సమ్మె<<>>ను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈనెల 15న జరిగిన చర్చల్లో కొన్ని అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చాయని JAC నేత కృష్ణయ్య తెలిపారు. దీంతో మిగిలిన అంశాలపై ఇవాళ చర్చించి సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు మధ్యాహ్నం 3 గం.కు విజయవాడలో చర్చలు ప్రారంభం కానున్నాయి.

News October 17, 2025

చతుర్వేదాల ఆవిర్భావం ఎలా జరిగిందంటే?

image

వేదాలు అపౌరుషేయాలు. అంటే వాటిని మనుషులు రచించలేదని అర్థం. పరమాత్మే మన కోసం వర ప్రసాదాలుగా అందించాడు. సృష్టి ఆరంభంలో గాయత్రి వంటి ఛందస్సుతో 4 వేదాలను ప్రకటించాడు. అగ్ని ద్వారా ఋగ్వేదాన్ని, వాయువు ద్వారా యజుర్వేదాన్ని, సూర్యుని ద్వారా సామవేదాన్ని, అంగీరసుని ద్వారా అధర్వణ వేదాన్ని అందించాడు. ఈ నలుగురి ద్వారానే ఈ వేదజ్ఞానం మహర్షులకు లభించింది. వారి నుంచే ఆ జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. <<-se>>#VedikVibes<<>>

News October 17, 2025

ఒక్కటైనా నేపాల్ అమ్మాయి- కామారెడ్డి అబ్బాయి

image

కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం తెల్గపూర్ వాసి రవీందర్, నేపాల్ యువతి ప్రేమించుకున్నారు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న రవీందర్ తన కార్యాలయంలో పనిచేస్తున్న నేపాల్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ఈ జంట ఇండియాకు వచ్చి గురువారం తెల్లాపూర్ గ్రామంలో భారతీయ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. గ్రామస్తులు, నాయకులు వివాహానికి హాజరై నవ దంపతులను అభినందించి ఆశీర్వదించారు.