News February 19, 2025
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య..

భార్య కాపురానికి రావడంలేదని మనస్థాపానికి గురై భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మద్నూర్ మండలంలో జరిగింది. SI విజయ్ కొండ వివరాలిలా..హండే కల్లూర్ వాసి సురేష్ (35) తో భార్య దేవ్ బాయ్ 5 ఏండ్ల క్రితం గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి సురేష్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 16న ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ఆచూకీ కోసం వెతకగా సలాబత్ పూర్ బోడ బావి దగ్గర శవమై కనిపించాడు. పిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 20, 2025
సీఎం సహాయనిది పేదలకు ఒక వరం: ఎంపీ కావ్య

అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహాయనిది ఒక వరమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఎంపీ CMRF చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 11 మందికి రూ.6 లక్షల 25 వేల విలువైన చెక్కులను అందజేశారు.
News November 20, 2025
ANU: ‘మాస్ కాపీయింగ్కి సహకరిస్తే గుర్తింపు రద్దు’

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో గుంటూరు, పల్నాడు జిల్లాలోని కొన్ని కాలేజీలలో మంగళవారం నుంచి జరుగుతున్న PG, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న ప్రచారంపై గురువారం యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు స్పందించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నమన్నారు. మాస్ కాపీయింగ్కి సహకరిస్తే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామన్నారు.
News November 20, 2025
GWL: బాల్య దశ మరపురానిది -అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు

బాల్య దశ ప్రతి ఒక్కరికి మరపురానిదని ఆ దశ అందరి జీవితంలో ఎప్పటికీ గుర్తుంటుందని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఐడిఓసిలో బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగింపు వేడుకలను ప్రారంభించారు. చదువుకోవడం బాలల హక్కు అని బడి మానేసిన వారిని బడిలో చేర్చాలని, పిల్లలు వేధింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.


