News February 19, 2025

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య..

image

భార్య కాపురానికి రావడంలేదని మనస్థాపానికి గురై భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన మద్నూర్ మండలంలో జరిగింది. SI విజయ్ కొండ వివరాలిలా..హండే కల్లూర్ వాసి సురేష్ (35) తో భార్య దేవ్ బాయ్ 5 ఏండ్ల క్రితం గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి సురేష్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 16న ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ఆచూకీ కోసం వెతకగా సలాబత్ పూర్ బోడ బావి దగ్గర శవమై కనిపించాడు. పిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News February 22, 2025

సంగారెడ్డి: గుండెపోటుతో ప్రభుత్వ టీచర్ మృతి

image

పటాన్‌చెరు మండలం చిట్కుల్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తున్న రాజేంద్రప్రసాద్ శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. పాఠశాలకు వెళ్లేందుకు రడీ అవుతుండగా ఇంట్లో గుండెపోటుకు గురైనట్లు తెలిసింది. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు. రాజేంద్ర సార్ అందరితో కలిసి మెలిసి ఉండే వారని, ఆయన మృతి బాధాకరమని తోటి టీచర్లు అన్నారు.

News February 22, 2025

HYD: చందానగర్‌లో దారుణ హత్య

image

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. గోపినగర్‌కు చెందిన ఫక్రుద్దీన్,‌ నజీర్ స్నేహితులు. రాత్రి 8 గంటల సమయంలో మాట్లాడే పని ఉందని స్నేహితులు గోపిచెరువు వద్దకు నజీర్‌ను తీసుకెళ్లారు. అక్కడ గొడవ జరగింది. ఫక్రుద్దీన్ దాడిలో నజీర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 22, 2025

HYD: చందానగర్‌లో దారుణ హత్య

image

చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానికుల వివరాలు.. గోపినగర్‌కు చెందిన ఫక్రుద్దీన్,‌ నజీర్ స్నేహితులు. రాత్రి 8 గంటల సమయంలో మాట్లాడే పని ఉందని స్నేహితులు గోపిచెరువు వద్దకు నజీర్‌ను తీసుకెళ్లారు. అక్కడ గొడవ జరగింది. ఫక్రుద్దీన్ దాడిలో నజీర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!