News March 13, 2025

భీంగల్: గ్రూప్-1 ,గ్రూప్- 2లో సత్తా చాటిన ఎక్సైజ్ SI

image

నిజామాబాద్ జిల్లా భీంగల్ లో ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కార్గాం గోవర్ధన్ ఇటీవల విడుదలైన గ్రూప్-1 , గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. గ్రూప్-2లో 394.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 88వ ర్యాంకు, బాసర జోన్‌లో 7వ ర్యాంకు సాధించాడు. ఈయన స్వగ్రామం నిర్మల్ జిల్లా కుంటాల మండలం. గ్రూప్-1 లో 421 మార్కులు సాధించి జిల్లా స్థాయి అధికారి పోస్ట్ కొరకు వేచి చూస్తుండటం విశేషం.

Similar News

News October 15, 2025

జనవరి నాటికి కోటి మందికి భూధార్ కార్డులు

image

TG: భూధార్‌ కార్డులను త్వరలోనే అందించనున్నారు. జనవరి నాటికి కోటి మంది రైతులకు భూధార్ అందించేలా రాష్ట్ర రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చేలా కేంద్రం భూధార్ తీసుకొచ్చింది. సర్వే రికార్డు, RORలోని వివరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తాత్కాలిక భూధార్‌ కార్డులు ఇచ్చి, రీ సర్వే చేశాక శాశ్వత కార్డులు ఇస్తామని భూభారతి చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

News October 15, 2025

రౌడీషీటర్ నవీన్‌రెడ్డి నగర బహిష్కరణ

image

రాచకొండ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండకు చెందిన రౌడీషీటర్ కొడుదుల నవీన్ రెడ్డిపై రాచకొండ సీపీ సుధీర్ బాబు నగర బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. దాడులు, హత్యాయత్నం, బెదిరింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడన్న కారణంగా అధికారులు 6 నెలల బహిష్కరణ ప్రతిపాదన తీసుకురాగా సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన ప్రస్తతం అబ్దుల్లాపూర్‌మెట్ పరిధి మన్నెగూడలో ఉంటున్నాడు.

News October 15, 2025

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ విక్రయానికి SC గ్రీన్ సిగ్నల్

image

ఢిల్లీలో దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ విక్రయం, వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. QR కోడ్ ఉన్న గ్రీన్ క్రాకర్స్‌ను ఈనెల 18 నుంచి 21 వరకు కాల్చుకోవచ్చని తెలిపింది. దేశ రాజధానిలో పొల్యూషన్ తీవ్ర స్థాయికి చేరడంతో క్రాకర్స్ విక్రయంపై గతంలో SC నిషేధం విధించింది. పిల్లలు ఎంతో సంబరంగా చేసుకునే దీపావళికి టపాసులు కాల్చుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై SC సానుకూలంగా స్పందించింది.