News March 13, 2025

భీంగల్: గ్రూప్-1 ,గ్రూప్- 2లో సత్తా చాటిన ఎక్సైజ్ SI

image

నిజామాబాద్ జిల్లా భీంగల్ లో ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కార్గాం గోవర్ధన్ ఇటీవల విడుదలైన గ్రూప్-1 , గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. గ్రూప్-2లో 394.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 88వ ర్యాంకు, బాసర జోన్‌లో 7వ ర్యాంకు సాధించాడు. ఈయన స్వగ్రామం నిర్మల్ జిల్లా కుంటాల మండలం. గ్రూప్-1 లో 421 మార్కులు సాధించి జిల్లా స్థాయి అధికారి పోస్ట్ కొరకు వేచి చూస్తుండటం విశేషం.

Similar News

News September 15, 2025

స్వధార్ హోమ్‌లో మహిళ ఆత్మహత్య: SI

image

విజయనగరంలోని BC కాలనీ మహిళా ప్రాంగణంలో ఉన్న స్వధార్ హోమ్‌లో భారతి (21) ఆత్మహత్య చేసుకుందని రూరల్ SI అశోక్ కుమార్ తెలిపారు. SI వివరాలు ప్రకారం.. అబూజా (17)ని భారతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొత్తవలసలోని ఓ చోరి కేసులో ఈ నెల 12న అబూజాని అరెస్ట్ చేసి బాల నేరస్థుల హోంకు తరలించారు. ప్రేమ వివాహం కారణంగా వీరిని కుటుంబ సభ్యులు దూరంగా ఉంచడంతో ఆమెను స్వధార్ హోమ్‌లో ఉంచారు. అక్కడ ఆమె అత్మహత్య చేసుకుంది.

News September 15, 2025

CSIRలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

image

<>CSIR <<>>అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్‌‌స్టిట్యూట్ 8 JRF, SRF, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ, ఎంఫిల్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 18వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి 45ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.csir.res.in/

News September 15, 2025

తిరుపతిలో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తా: SP

image

శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఎస్పీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంచడమే పోలీసుల ధ్యేయమని, 24 గంటల పాటు అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘డ్రగ్స్ ఫ్రీ తిరుపతి’ తన లక్ష్యం అన్నారు.