News March 13, 2025

భీంగల్: గ్రూప్-1 ,గ్రూప్- 2లో సత్తా చాటిన ఎక్సైజ్ SI

image

నిజామాబాద్ జిల్లా భీంగల్ లో ఎక్సైజ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కార్గాం గోవర్ధన్ ఇటీవల విడుదలైన గ్రూప్-1 , గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. గ్రూప్-2లో 394.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 88వ ర్యాంకు, బాసర జోన్‌లో 7వ ర్యాంకు సాధించాడు. ఈయన స్వగ్రామం నిర్మల్ జిల్లా కుంటాల మండలం. గ్రూప్-1 లో 421 మార్కులు సాధించి జిల్లా స్థాయి అధికారి పోస్ట్ కొరకు వేచి చూస్తుండటం విశేషం.

Similar News

News April 19, 2026

NRPT: ప్రజలు గొలుసుకట్టు వ్యాపారాలకు దూరంగా ఉండాలి

image

ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్తకొత్త పోకడలతో ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకునేందుకు కొత్త పంథాను ప్రయోగిస్తున్నారని వాటి మాయలో పడి ఆర్థికంగా నష్టపోవద్దని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. మల్టీలెవల్ మార్కెటింగ్ పథకాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు.

News April 19, 2026

రేపు చంద్రబాబు బర్త్‌డే.. CDP రిలీజ్ చేసిన లోకేశ్

image

AP: రేపు సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ CDP (కామన్ డిస్‌ప్లే పిక్చర్) రిలీజ్ చేశారు. అందులో ఐటీ కంపెనీలు, అన్న క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు, అమరావతి, పేదలకు ఇళ్లు, పెన్షన్ల పంపిణీ, తల్లికి వందనం లాంటి పథకాల వివరాలను పొందుపర్చారు. అటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లలో రేపు ఉచిత భోజనం కోసం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రూ.76 లక్షల విరాళం అందించారు.

News April 19, 2026

నిర్మల్ డీసీసీలో మార్పులు

image

నిర్మల్ జిల్లా డీసీసీలో మార్పులు ప్రతిపాదించారు. డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సవరించిన కార్యవర్గ జాబితాను సిద్ధం చేశారు. ధర్మ గౌడ్, రమేష్, మమ్మాయి రమేష్‌‌ను వైస్ ప్రెసిడెంట్లుగా, దాశరథి రాజేశ్వర్‌ను కోశాధికారిగా, డీసీసీ కార్యనిర్వాహక సభ్యుడిగా మజార్ ఖాన్ ప్రతిపాదించారు. పలు మండలాల నుంచి సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎంపిక చేశారు. సామాజిక సమీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు.