News February 14, 2025
భీమడోలు: యువకుడిని కాపాడిన పోలీసులు

కురెళ్ళగూడెంకి చెందిన ధనుష్ చేసిన అప్పులు తీర్చమని తండ్రి సీతారామయ్య పై ఒత్తిడి తెచ్చాడు. తండ్రి మందలించడంతో ధనుష్ వెళ్ళిపోయి వేరొక ప్రాంతం నుంచి తాను ఆత్మహత్య చేసుకోనున్నట్లు ఫోన్ ద్వారా తండ్రికి సమాచారం ఇచ్చాడు. తండ్రి పోలీసులను సంప్రదించారు . భీమడోలు ఎస్ఐ తన తోటి సిబ్బంది సహకారంతో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటానన్న ధనుష్ ను గుర్తించారు. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు.
Similar News
News March 27, 2025
బాపట్ల జిల్లా TODAY TOP NEWS

◆బాపట్ల జిల్లాలో యువ రైతు ఆత్మహత్య
◆రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు: MLA నరేంద్ర
◆ప్రజల్ని మభ్యపెడుతున్న కూటమి: వరికూటి అశోక్
◆పర్చూరు: సులువు కానున్న తెలంగాణ- ఆంధ్ర రవాణా
◆మార్టూరు: ‘మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎక్కడ’
◆చివరి ఎకరా వరకు నీరు అందాలి: MLA నక్కా
◆బల్లికురవ: ‘వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి’
◆బాపట్ల మెడికల్ కాలేజీ నిర్మాణంలో నిర్లక్ష్యం: కోన
News March 27, 2025
విశాఖలో లులూ మాల్.. భూమి కేటాయింపు

AP: విశాఖపట్నంలో లులూ గ్రూప్ నిర్మించబోయే షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కులో 13.43 ఎకరాలను APIICకి బదలాయించాలని VMRDAకు ఆదేశాలు జారీ చేసింది. 2017లోనే లులూకు భూమి కేటాయించగా 2023లో గత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ భూకేటాయింపులు చేయాలని APIICని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు.
News March 27, 2025
నెలన్నరలో 325 మంది మావోలు హతం: ఛత్తీస్గఢ్ సీఎం

ఛత్తీస్గఢ్లో నెలన్నరలో 325 మంది మావోయిస్టులు హతమైనట్లు ఆ రాష్ట్ర CM విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు. మరో 2 వేల మంది అరెస్టు లేదా లొంగిపోయినట్లు వెల్లడించారు. రాష్ట్రం మొత్తం మావోయిస్టుల ప్రభావం ఉందన్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. బస్తర్ ప్రాంతం మినహా ఎక్కడా నక్సల్స్ లేరని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో ఎక్కడా వారి జాడ లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు CM తెలిపారు.