News March 7, 2025

భీమదేవరపల్లి: న్యాయం కోసం CM వద్దకు పాదయాత్ర

image

భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన ఆషాడపు దశరథం కొడుకు రాజేష్ 2018లో ఓ పెళ్లి బారాత్‌లో డాన్స్ చేస్తూ మృతిచెందాడు. విష ప్రయోగంతో చనిపోయాడని, నిందితులను శిక్షించి న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నాడు. కొన్ని నెలలుగా దశరథం దంపతులు వంగర పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేస్తున్నారు. గురువారం ‘న్యాయం కోసం ముఖ్యమంత్రి’ వద్దకు బ్యానరుతో బయలు దేరారు. రాంనగర్ వద్దకు వెళ్లగానే పోలీసులు అడ్డుకున్నారు.

Similar News

News March 9, 2025

సంగారెడ్డి కలెక్టరేట్‌లో రేపు ప్రజావాణి

image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రేపు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 9, 2025

రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు: హరీశ్ రావు

image

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో CM రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. బడి పిల్లల యూనిఫాం కుట్టేందుకు మహిళా సంఘాలకు రూ.75 చొప్పున ఇచ్చినట్లు పచ్చి అబద్ధం చెప్పారన్నారు. ప్రభుత్వం రూ.50 చొప్పున మాత్రమే ఇచ్చిందన్నారు. అలాగే, BRS రూ.50 ఇస్తే, రూ.25 ఇచ్చారని అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. CM మాటలు వినలేక మహిళలు వెళ్లిపోతుంటే పోలీసులు ఆపారని ఎద్దేవా చేశారు.

News March 9, 2025

రేపు భద్రాద్రి కలెక్టరేట్‌లో ప్రజావాణి

image

కొత్తగూడెం: ప్రజాసమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందజేయాలని కలెక్టర్ సూచించారు.

error: Content is protected !!