News March 13, 2025
భీమవరంలో కాలేజీకి బాంబు బెదిరింపులు

భీమవరంలో బాంబు పెట్టామని సమాచారం రావడం కలకలం రేపింది. ‘పార్లమెంట్పై దాడి చేసిన అప్జల్ గురును ఉరేశారు. దీనికి నిరసనగా కాలేజీలో బాంబ్ పెట్టాం’ అంటూ శ్రీవిష్ణు ఎడ్యుకేషన్ సొసైటీలోని డెంటల్ కాలేజీకి బుధవారం మెయిల్ వచ్చింది. వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. దాదాపు 3 గంటలకుపైగా తనిఖీలు చేసి.. బాంబ్ లేదని తేల్చారు. తమిళనాడులోని ఓ వ్యక్తి పేరిట ఈ మెయిల్ వచ్చినట్లు సమాచారం.
Similar News
News December 1, 2025
కోహ్లీ 100 సెంచరీలు చేస్తారా?

SAపై నిన్న కోహ్లీ చెలరేగిన తీరు చూస్తే సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవడం కష్టం కాదేమో అని క్రీడా వర్గాల్లో టాక్ మొదలైంది. 2027 WCకు ముందు భారత్ ఇంకా 20 వన్డేలు ఆడనుంది. లీగ్లో ఫైనల్కు చేరితే మరో 5 నుంచి 10 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 83 శతకాలు బాదిన కోహ్లీ ఇక నుంచి ప్రతి 3 మ్యాచులకు 2 సెంచరీలు చేస్తే సచిన్ సరసన నిలిచే ఛాన్సుంది. మరి విరాట్ ఆ ఘనత సాధిస్తారా? మీ COMMENT.
News December 1, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 1, 2025
అధ్యక్షా.. కడప – బెంగుళూరు రైలు రోడ్డు కథ కంచికేనా..?

మదనపల్లి జిల్లా కల నెరవేరింది. కడప- బెంగళూరు రైలు రోడ్డు వేస్తామని మరిచారు. అయితే ఇవాళ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన గళం వినిపించి కడప మదనపల్లి మీదుగా బెంగుళూరుకి రైల్వే రోడ్డుకు కృషి చేస్తారా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాజంపేట పరిధిలో బస్ షెల్టర్ల ఏర్పాటుపై చర్చించి, గతంలో మంజూరైన రైల్వే రోడ్డు, బస్ షెల్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తారా? చూడాలి.


