News March 13, 2025
భీమవరంలో కాలేజీకి బాంబు బెదిరింపులు

భీమవరంలో బాంబు పెట్టామని సమాచారం రావడం కలకలం రేపింది. ‘పార్లమెంట్పై దాడి చేసిన అప్జల్ గురును ఉరేశారు. దీనికి నిరసనగా కాలేజీలో బాంబ్ పెట్టాం’ అంటూ శ్రీవిష్ణు ఎడ్యుకేషన్ సొసైటీలోని డెంటల్ కాలేజీకి బుధవారం మెయిల్ వచ్చింది. వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. దాదాపు 3 గంటలకుపైగా తనిఖీలు చేసి.. బాంబ్ లేదని తేల్చారు. తమిళనాడులోని ఓ వ్యక్తి పేరిట ఈ మెయిల్ వచ్చినట్లు సమాచారం.
Similar News
News November 17, 2025
అరకు: వణికిస్తున్న చలి పులి

ప్రముఖ పర్యటక కేంద్రమైన అరకులోయలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. రాత్రివేళ చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం భానుడు ఉదయించినా పొగ మంచు తొలగిపోవడం లేదు. ప్రజలు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు ధరిస్తూ చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.
News November 17, 2025
అరకు: వణికిస్తున్న చలి పులి

ప్రముఖ పర్యటక కేంద్రమైన అరకులోయలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. రాత్రివేళ చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం భానుడు ఉదయించినా పొగ మంచు తొలగిపోవడం లేదు. ప్రజలు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లు ధరిస్తూ చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.
News November 17, 2025
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఉత్తర్వులు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతర్జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించింది. కొత్త గైడ్లైన్స్ ప్రకారం బదిలీలు ఉంటాయని పేర్కొంది. డిసిప్లినరీ, ACB కేసులు ఉన్నవారు ట్రాన్స్ఫర్కు అనర్హులని తెలిపింది. ప్రొవిజనల్ సీనియారిటీ, క్లియర్ వేకెన్సీ ఆధారంగా బదిలీ అవుతారంది. పోర్టల్ ద్వారానే అప్లై చేసుకోవాలని, శాఖా సెక్రటరీలు ఇంటర్ బదిలీ ఆర్డర్లు ఇస్తారని తెలిపింది.


