News October 1, 2024

భీమవరంలో యువకుడి ఆత్మహత్య

image

భీమవరంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన కె.మణికంఠ కుమార్(32) సోమవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మంగళవారం ఉదయం అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News November 17, 2025

ప్రజలకు సంతృప్తి కలిగేలా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుంచి 162 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని, తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

News November 17, 2025

ప్రజలకు సంతృప్తి కలిగేలా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుంచి 162 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని, తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

News November 17, 2025

పీఎంఏవై కింద ఇళ్ల మంజూరుకు త్వరపడండి: కలెక్టర్

image

గ్రామీణ ప్రాంతంలో సొంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ గృహం మంజూరుకు త్వరపడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం ద్వారా ఇళ్లు లేని పేదలకు గృహాలను మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. ఈ నెల 30 లోగా అర్హులైన వారందరూ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.