News October 1, 2024

భీమవరంలో యువకుడి ఆత్మహత్య

image

భీమవరంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన కె.మణికంఠ కుమార్(32) సోమవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మంగళవారం ఉదయం అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News November 18, 2025

ఈ ఏడాదిలో 40.399 కేజీల గంజాయి సీజ్: ఎస్పీ

image

మాదకద్రవ్యాల నియంత్రణలో ఈ ఏడాది 12 కేసులు నమోదు అయ్యాయని, 55 మందిని అరెస్టు చేయగా 40.399 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. దీని విలువ సుమారు రూ.3,72,680 లు ఉంటుందని, 2 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 64 కేసుల్లో సీజ్ చేసిన మొత్తం 641.544 కిలోల గంజాయిని జూలై 9న దహనం చేయడం జరిగిందన్నారు.

News November 18, 2025

ఈ ఏడాదిలో 40.399 కేజీల గంజాయి సీజ్: ఎస్పీ

image

మాదకద్రవ్యాల నియంత్రణలో ఈ ఏడాది 12 కేసులు నమోదు అయ్యాయని, 55 మందిని అరెస్టు చేయగా 40.399 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. దీని విలువ సుమారు రూ.3,72,680 లు ఉంటుందని, 2 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 64 కేసుల్లో సీజ్ చేసిన మొత్తం 641.544 కిలోల గంజాయిని జూలై 9న దహనం చేయడం జరిగిందన్నారు.

News November 18, 2025

ప.గో. జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా కందుల భాను ప్రసాద్

image

పశ్చిమగోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా భీమవరం పట్టణానికి చెందిన కందుల భాను ప్రసాద్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేశ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళ్రావు చేతుల మీదుగా మంగళవారం ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఉక్కుసూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.