News July 12, 2024

భీమవరంలో రిటైర్డ్ జవాన్‌కు ఘన స్వాగతం

image

దేశానికి విశేష సేవలు అందించి రిటైర్డ్ అయ్యి భీమవరం తిరిగి వచ్చిన జావాన్ దాసరి దుర్గా రమేశ్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జవాన్ రమేశ్ MRO కార్యాలయంలోని క్విట్ ఇండియా స్తూపం వద్ద నివాళులర్పించారు. 2001 నుంచి 2024 వరకు జమ్మూ-కశ్మీర్, రాజస్థాన్, హిమాచల్ బార్డర్‌లో ఎన్‌సీవో హెడ్‌గా దేశ రక్షణలో సేవలందించిన ఆయన.. తిరిగి భీమవరం చేరుకున్నారు.

Similar News

News October 18, 2025

పేదలకు ఉచిత న్యాయ సలహా: జడ్జి కే. మాధవి

image

పేదలకు ఉచిత న్యాయ సలహా, సహాయాన్ని అందిస్తామని తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జి కే. మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సూర్యకిరణ్ శ్రీ తెలిపారు. శనివారం పెంటపాడు, గణపవరం పంచాయతీ కార్యాలయాల వద్ద వారు న్యాయ సహాయ సేవా కేంద్రాలను ప్రారంభించారు. న్యాయపరమైన సమస్యలకు ఉచితంగా పరిష్కారం అందిస్తామన్నారు. చిన్న సమస్యలను ‘లీగల్ ఎయిడ్ క్లినిక్’ ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు.

News October 18, 2025

వివాహిత అదృశ్యం కేసు పై హైకోర్టు సీరియస్

image

తాడేపల్లిగూడెం (M) దండగర్రకు చెందిన వివాహిత మహిళ మంగాదేవి అదృశ్యం కేసు విచారణలో హైకోర్టు సీరియస్ అయింది. మహిళ తండ్రి బండారు ప్రకాశరావు 2017లో కోర్టును ఆశ్రయించడంతో ఆ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. వివాహిత భర్త బ్రహ్మాజీని ఐదేళ్ల తర్వాత విచారించడం పై హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు పురోగతి తెలియజేయాలంటూ పోలీసులకు ఆదేశిస్తూ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

News October 17, 2025

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి: జేసీ

image

ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై భీమవరం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ధాన్యం సేకరణ త్వరలో ప్రారంభం కానున్నందున, సంబంధిత అధికారులు ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆర్డీవోలకు సూచించారు.