News November 24, 2024

భీమవరం: ‘అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి’

image

భీమవరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి డ్వామా, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 368 సీ.సీ, బీ.టీ, డబ్ల్యూబీఎంలు నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయవలసి ఉండగా 318 గ్రౌండ్ కాగా, మొదలు పెట్టని 50 పనులను వెంటనే చేపట్టి డిసెంబర్ నెలాఖరుకి పూర్తి చేయాలని అన్నారు. రోడ్డు నిర్మాణ పనుల పురోగతి కనబర్చకపోతే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Similar News

News October 22, 2025

నరసాపురం: కీచక తండ్రి కటకటాల్లోకి..!

image

కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన తండ్రిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నరసాపురానికి చెందిన మహిళ తన ఇద్దరు కుమార్తెలను భర్త వద్ద వదిలి గల్ఫ్ వెళ్లింది. ఈ క్రమంలో ఆ తండ్రి తాగి వచ్చి తన కుమార్తె (13) పట్ల కీచకుడయ్యాడు. ఇటీవల గల్ఫ్ నుంచి తల్లి రావడంతో కుమార్తెలు విషయం చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించారు.

News October 22, 2025

నరసాపురం: కీచక తండ్రి కటకటాల్లోకి..!

image

కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన తండ్రిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నరసాపురానికి చెందిన మహిళ తన ఇద్దరు కుమార్తెలను భర్త వద్ద వదిలి గల్ఫ్ వెళ్లింది. ఈ క్రమంలో ఆ తండ్రి తాగి వచ్చి తన కుమార్తె (13) పట్ల కీచకుడయ్యాడు. ఇటీవల గల్ఫ్ నుంచి తల్లి రావడంతో కుమార్తెలు విషయం చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించారు.

News October 22, 2025

ఈనెల 27న TPG లో కొనుగోలు కేంద్రం ప్రారంభం: జేసీ

image

ఈనెల 27న తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు జేసీ రాహుల్ తెలిపారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతు సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు.