News October 20, 2024
భీమవరం: ‘ఇసుక సమస్యలపై టోల్ ఫ్రీను సంప్రదించండి’

ఉచిత ఇసుక పొందడానికి సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి టెక్నికల్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం భీమవరంలోని కలెక్టరేట్లో జిల్లా కాల్ సెంటర్ టెక్నికల్ సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక సాంకేతిక సమస్యలపై సమీక్షించారు. అనంతరం ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు 93914 45753, 86882 91997, 81869 39223, 95501 75144 సంప్రదించాలని సూచించారు.
Similar News
News October 3, 2025
జిల్లాలో నేటి నుంచి 3వ పేజ్ రీ సర్వే: కలెక్టర్

జిల్లాలో నేటి నుంచి 3వ దశ రీ-సర్వే జిల్లాలో మొదలవుతుందని కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 221 గ్రామాలలో రీ-సర్వే పూర్తి చేశామని, మరో 22 గ్రామాలలో జరుగుతోందని అన్నారు. రైతులందరూ రీ-సర్వేకు సహకరించాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది మీ భూమి సర్వే ఎప్పుడు చేస్తారో ముందుగా నోటీస్ ద్వారా తెలియజేస్తారని, ఆ సమయంలో రైతులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
News October 2, 2025
రాష్ట్ర స్థాయిలో స్వర్ణాంధ్ర అవార్డులు: కలెక్టర్ హర్షం

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల నిర్వహణలో 1 రాష్ట్రస్థాయి, 49 జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. దేశంలోనే ఒక రాష్ట్రం 17 అవార్డు విభాగాలలో ఇటువంటి సమగ్ర శుభ్రత సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఈ వివరాలను సాసా (SASA) పోర్టల్ https://sasa.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
News October 2, 2025
శభాష్ తణుకు పోలీస్.. రెండు సంచలన కేసుల్లో పురోగతి

ఇటీవల తణుకులో సంచలనం రేకెత్తించిన రెండు ఘటనల్లో పోలీసులు పురోగతి సాధించారు. అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన యువకుడు బడుగుల సురేశ్ హత్య కేసును పోలీసులు చేధించారు. తణుకు వారణాసి వారి వీధిలో వృద్ధురాలు కనకదుర్గను చంపుతామని బెదిరించి 70 కాసుల బంగారం అపహరించిన కేసులో నిందితుడిని మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విజయదశమి రోజున చేధించడం విశేషం.