News October 20, 2024
భీమవరం: ‘ఇసుక సమస్యలపై టోల్ ఫ్రీను సంప్రదించండి’
ఉచిత ఇసుక పొందడానికి సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి టెక్నికల్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం భీమవరంలోని కలెక్టరేట్లో జిల్లా కాల్ సెంటర్ టెక్నికల్ సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక సాంకేతిక సమస్యలపై సమీక్షించారు. అనంతరం ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు 93914 45753, 86882 91997, 81869 39223, 95501 75144 సంప్రదించాలని సూచించారు.
Similar News
News October 21, 2024
ఏలూరు: CM ఫొటో మార్ఫింగ్.. ఒకరిపై కేసు
సీఎం చంద్రబాబు ఫొటోను అసభ్యంగా మార్చిన ఓ వ్యక్తిపై ఏలూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. లింగపాలెం మండలం బోగోలుకు చెందిన సాతునూరు లక్ష్మీనవదీప్ సీఎం చంద్రబాబు ఫొటోను అసభ్యకరంగా మార్చాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదే విషయమై కె.యోహాన్ అనే వ్యక్తి లక్ష్మీనవదీప్పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లింగపాలెం ఎస్ఐ వెంకన్న కేసు నమోదు చేశారు.
News October 21, 2024
చింతమనేనికి బెదిరింపు.. బోరుగడ్డపై కేసు
వైసీపీ మద్దతుదారుడు బోరుగడ్డ అనిల్ కుమార్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై ఏలూరులోనూ కేసు నమోదైంది. దెందలూరు MLA చింతమనేని ప్రభాకర్కు 2023లో బోరుగడ్డ ఫోన్ చేశారు. ‘మా పార్టీ తలచుకుంటే నీ అంతు చూస్తుంది. మీ సామాజికవర్గాన్ని ఖతం చేస్తాం’ అని బెదిరించారు. ఈక్రమంలో చింతమనేని ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్లో నిన్న రాత్రి కేసు నమోదు చేశారు.
News October 20, 2024
ఏలూరు: హైకోర్టు జడ్జిని కలిసిన కలెక్టర్ వెట్రి సెల్వి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి సురేశ్ రెడ్డి ఆదివారం ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లా కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.వెట్రి సెల్వి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం పలు జిల్లాకు సంబంధించిన అంశాలపై చర్చించారు.