News October 20, 2024
భీమవరం: ‘ఇసుక సమస్యలపై టోల్ ఫ్రీను సంప్రదించండి’

ఉచిత ఇసుక పొందడానికి సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి టెక్నికల్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం భీమవరంలోని కలెక్టరేట్లో జిల్లా కాల్ సెంటర్ టెక్నికల్ సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక సాంకేతిక సమస్యలపై సమీక్షించారు. అనంతరం ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు 93914 45753, 86882 91997, 81869 39223, 95501 75144 సంప్రదించాలని సూచించారు.
Similar News
News October 12, 2025
పైడిపర్రు కాలువలో పదేళ్ల బాలుడు గల్లంతు

తణుకు మండలం పైడిపర్రు కాలువలో ఆదివారం మధ్యాహ్నం 10ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. సుమారు పదిమంది కాలువలో దిగి ఆడుకుంటూ ఉండగా వీరిలో గుర్తుతెలియని బాలుడు గల్లంతయ్యాడు. స్థానికులు కాలువలోకి దిగి గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తణుకు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
News October 12, 2025
ఉండి: విద్యుత్ షాక్తో యువకుడి మృతి

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఆరేడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తాండేశ్వర్ స్వామి ఆలయానికి లీజులో ఉన్న రొయ్యల చెరువు వద్ద శనివారం ఛత్తీస్గఢ్కు చెందిన బహదూర్ (25) అనే యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. చెరువులోని మోటారు ఆగిపోవడంతో దాన్ని పరిశీలించేందుకు వెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. నెలవారీ జీతానికి పనిచేస్తున్న యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News October 12, 2025
జీఎస్టీ బెనిఫిట్ బజార్ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

భీమవరంలో సూపర్ జీఎస్టీ బెనిఫిట్ బజార్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 నుంచి 19 వరకు భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ నందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీ తగ్గింపుల ప్రచారాన్ని 4 కేటగిరీలుగా విభజించి మూడు వారాలపాటు వివిధ వస్తువుల ప్రదర్శనలతో అవగాహన కలిగించే విధంగా ప్రచారాన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు.