News February 5, 2025

భీమవరం: ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని మృతి

image

ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమవరం(M) గునుపూడి గరువపేటలో జరిగింది. డిగ్రీ చదువుతున్న అనూష(19) సత్యనారాయణ అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ నెల 3న ఫోన్‌లో ఇద్దరికి ఘర్షణ జరిగింది. కాసేపటికి అనూష సోదరికి సత్యనారాయణ ఫోన్ చేసి మీ సోదరి చనిపోతా అంటుంది చూడమని చెప్పాడు. అనూష రూమ్ తలుపులు పగలకొట్టి చూడగా అప్పటికే చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఘటనపై కేసు నమోదైంది.

Similar News

News December 9, 2025

ఎంజీఎంలో టెండర్లు ఉండవా ?

image

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గుత్తేదారులతో హవా నడుస్తోంది. కాల పరిమితి ముగిసినా టెండర్లు పిలవకపోవడంతో పాత కాంట్రాక్టు సంస్థలకే కట్టబెడుతున్నారు. శానిటేషన్ టెండర్ ముగిసినా గత 3 నెలలుగా వారితోనే సిబ్బంది వేతనాలు కోతలతో చెల్లిస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. స్టేషనరీ, సర్జికల్, మెడికల్ టెండర్లు పిలవకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

News December 9, 2025

రాజధానిలో గ్రామకంఠాల సర్వే.. 13 బృందాలు రంగంలోకి

image

రాజధాని 29 గ్రామాల్లో గ్రామకంఠాల గందరగోళానికి చెక్ పెట్టేందుకు CRDA 13 సర్వే బృందాలను రంగంలోకి దించింది.
రైతులు మినహాయింపుల్లో అవకతవకలు ఉన్నాయంటూ పలుమార్లు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం త్రీమెన్ కమిటీని ఏర్పాటుచేసింది. ప్రతి బృందంలో వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ ఉంటారు. వారికి శిక్షణ ఇచ్చి త్వరలో గ్రామాల్లో సర్వే ప్రారంభిస్తారు. నివేదికలు అందిన తర్వాత మినహాయింపులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

News December 9, 2025

క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు.. రస్సెల్

image

విండీస్ ఆల్‌రౌండర్ రస్సెల్ చరిత్ర సృష్టించారు. T20లలో 5000+ రన్స్, 500+ సిక్సులు, 500+ వికెట్లు సాధించిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించారు. అన్ని దేశాల లీగ్‌లలో కలిపి రస్సెల్ 576 మ్యాచ్‌లు ఆడారు. మొత్తంగా 9,496 రన్స్, 972 సిక్సర్లు, 628 ఫోర్లు బాదారు. కాగా వ్యక్తిగతంగా 126 మంది 5000+ రన్స్, ఆరుగురు 500+ వికెట్లు, 10 మంది 500+ సిక్సర్లు బాదారు. కానీ ఇవన్నీ చేసిన ఒకేఒక్కడు రస్సెల్.