News February 5, 2025
భీమవరం: ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని మృతి

ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమవరం(M) గునుపూడి గరువపేటలో జరిగింది. డిగ్రీ చదువుతున్న అనూష(19) సత్యనారాయణ అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ నెల 3న ఫోన్లో ఇద్దరికి ఘర్షణ జరిగింది. కాసేపటికి అనూష సోదరికి సత్యనారాయణ ఫోన్ చేసి మీ సోదరి చనిపోతా అంటుంది చూడమని చెప్పాడు. అనూష రూమ్ తలుపులు పగలకొట్టి చూడగా అప్పటికే చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకుంది. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News December 3, 2025
PCOSతో దంత సమస్యలు

పీసీఓఎస్ సమస్య పెరిగినప్పుడు ‘పెరియోడాన్టైటిస్’ అనే చిగుళ్ల సమస్య కూడా వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దంతాలు వదులవుతాయంటున్నారు. PCOS వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో చిగుళ్లలో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి వైద్యులను సంప్రదిస్తే తగిన మందులతో పాటు ఆహారపుటలవాట్లలో కూడా మార్పులు-చేర్పులు సూచిస్తారని చెబుతున్నారు.
News December 3, 2025
సంగారెడ్డి: నేటి నుంచి 3వ విడత నామినేషన్లు

సంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట, సిర్గాపూర్, న్యాల్కల్ మండలాల్లోని 234 సర్పంచ్, 1,960 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. సాం.5గ. తర్వాత నామినేషన్ కేంద్రం ప్రధాన గేట్ మూసివేస్తారు
News December 3, 2025
ఖమ్మం: ఆలస్యం, సెలవులపై వేటు.. టీచర్లకు WARNING

ఎఫ్ఆర్ఎస్ (ముఖ గుర్తింపు హాజరు) ఉన్నప్పటికీ విధులకు ఆలస్యంగా రావడం, ముందుగా వెళ్లిపోతున్న ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ముఖ్యంగా, 6 నెలలు సెలవు తీసుకుని విదేశాల నుంచి దీర్ఘకాలికంగా విధులకు రాని టీచర్ల వివరాలను సేకరించి, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అవసరమైతే వారిని ఉద్యోగం నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.


