News February 28, 2025

భీమవరం: పంచారామం అన్నదాన సత్రానికి రూ.కోటి విరాళం

image

భీమవరం పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయం అన్నదాన సత్రం పిలీగ్రీం సెంటరుకు రూ. కోటి మంజూరైంది. ఈ ప్రత్యేక గ్రాంటును దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ నుంచి ఆర్డర్ కాపీని తీసుకొచ్చి భీమవరం MLA,PAC ఛైర్మన్ పులపర్తి రామాంజనేయులుకి శ్రీవేద విజ్ఞాన పరిషత్ ఛైర్మన్ DV బాలసుబ్రహ్మణ్యం గురువారం అందజేశారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ CH రంగసాయి పాల్గొన్నారు.

Similar News

News October 27, 2025

పశ్చిమ గోదావరి జిల్లాలో 28 పునరావాస కేంద్రాలు

image

‘మొంథా’ తుఫాన్ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో మొత్తం 28 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. నరసాపురం డివిజన్‌లో 10, తాడేపల్లిగూడెం డివిజన్‌లో 8, భీమవరం డివిజన్‌లో 10 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ తీవ్రత, భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

News October 27, 2025

‘మొంథా’ తుఫాను.. అగ్నిమాపక బృందాలు సిద్ధం

image

‘మొంథా’ ముప్పు నేపథ్యంలో ప.గో. అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలోని ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో 90 మంది సిబ్బందిని సిద్ధం చేశారు. ఏడు ఫైర్‌ ఇంజన్లు, 10 నీటిని తోడే యంత్రాలు, 80 లైఫ్‌ జాకెట్లు, 40 లైఫ్‌ బాయ్స్‌, 30 రోప్‌లతోపాటు అత్యవసర పరికరాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా తుఫాన్‌ సమయంలో పడిపోయే చెట్లను తొలగించడానికి 12 బృందాలతో కూడిన 24 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించారు.

News October 27, 2025

తణుకు: జాతీయ రహదారిపై నిలిచిన ఆర్టీసీ బస్సు

image

ఆర్టీసీ బస్సుల నిర్వహణ తీరు అధ్వానంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తాజాగా, కాకినాడ డిపోనకు చెందిన బైపాస్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సు (విజయవాడ-కాకినాడ) ఆదివారం రాత్రి తణుకు సర్మిష్ట సెంటర్ జాతీయ రహదారిపై నిలిచిపోయింది. ఇంజన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతోనే బస్సు ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.