News April 10, 2025
భీమవరం పొలాల్లో చెట్టుకి వేలాడుతున్న మృతదేహం

ఇంకొల్లు మండలం భీమవరం గ్రామంలోని శేషాయిగుంట పొలాల్లో చెట్టుకి యువకుడి మృతదేహం వేలాడుతున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. ఓ గొర్రెల కాపరి గమనించి గ్రామపెద్దలకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టి యువకుడు పోలూరు మహేశ్ (27)గా గుర్తించారు. మృతుడికి సంవత్సరం కిందట వివాహమైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 16, 2025
HYD: బంధాన్ని నిలుపుకో.. వదులుకోకు..!

HYDలో మనువు మున్నాళ్ల ముచ్చటగా మారుతున్న పరిస్థితి కలవరపెడుతోంది. ఈగో, విలువలు తగ్గటం, వివాహేతర సంబంధాలు, అభద్రతా భావం, తొందరపాటు నిర్ణయాలు, కొత్తకల్చర్ వంటి వాటితో కోర్టు మెట్లెక్కుతున్నట్లు ఏటా నమోదవుతున్న కేసులు చెబుతున్నాయి. ఇందులో 25- 35 ఏళ్ల జంటలు 75% ఉన్నాయి. న్యాయస్థానాల్లో ప్రతినెలా 250 కేసులు నమోదవుతున్నాయి. బంధాన్ని బలపర్చుకోవడానికి ఆలోచించాలి కానీ బలహీనపరుచుకోవడానికి కాదని పెద్దల మాట.
News November 16, 2025
తేనెటీగల పెంపకంలో మహిళల విజయం: సీఎండీ

సింగరేణి సామాజిక బాధ్యతలో భాగంగా కొత్తగూడెం ఏరియాలో మహిళల స్వయం ఉపాధి కోసం చేపట్టిన తేనెటీగల పెంపకం కార్యక్రమం విజయవంతమైంది. ఉత్పత్తి అయిన తొలి తేనెను మహిళలు ఆదివారం సీఎండీ ఎన్. బలరామ్కు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తమకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబనను అందిస్తోందని సీఎండీ పేర్కొన్నారు.
News November 16, 2025
HYD: బంధాన్ని నిలుపుకో.. వదులుకోకు..!

HYDలో మనువు మున్నాళ్ల ముచ్చటగా మారుతున్న పరిస్థితి కలవరపెడుతోంది. ఈగో, విలువలు తగ్గటం, వివాహేతర సంబంధాలు, అభద్రతా భావం, తొందరపాటు నిర్ణయాలు, కొత్తకల్చర్ వంటి వాటితో కోర్టు మెట్లెక్కుతున్నట్లు ఏటా నమోదవుతున్న కేసులు చెబుతున్నాయి. ఇందులో 25- 35 ఏళ్ల జంటలు 75% ఉన్నాయి. న్యాయస్థానాల్లో ప్రతినెలా 250 కేసులు నమోదవుతున్నాయి. బంధాన్ని బలపర్చుకోవడానికి ఆలోచించాలి కానీ బలహీనపరుచుకోవడానికి కాదని పెద్దల మాట.


