News January 28, 2025

భీమవరం వాసికి అరుదైన అవకాశం

image

ప.గో జిల్లా వాసికి అరుదైన అవకాశం లభించింది. భీమవరానికి చెందిన చల్లా ధనంజయ ఏపీ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్‌గా సెలక్టయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆర్డర్స్ ఇచ్చింది. 1983 నుంచి ఆయన లాయర్‌గా పనిచేస్తున్నారు. 1987 వరకు రాజమండ్రిలో వర్క్ చేసిన ఆయన.. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారు. 2022లో సీనియర్ లాయర్ గుర్తింపు దక్కింది. తాజా పదవి ప్రకారం ఆయన.. ఏపీ హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తారు.

Similar News

News October 24, 2025

తణుకు: నాగుల చవితికి తేగలు సిద్ధం

image

నాగులచవితి పురస్కరించుకొని మార్కెట్లో తేగలు అందుబాటులోకి వచ్చాయి. సహజసిద్ధంగా దొరికే తేగలు, బుర్ర గుంజు నాగులచవితి రోజున పుట్టలో వేస్తుంటారు. అప్పటినుంచి తేగలు తినడానికి మంచి రోజుగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా విరివిగా దొరికే తేగలను మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. నాగుల చవితి రోజున వినియోగించడానికి ఒక్కో తేగను తణుకులో రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు.

News October 24, 2025

డీఎస్పీకి RRR కితాబివ్వడం సరికాదు: కొత్తపల్లి

image

డిప్యూటీ స్పీకర్ రఘురామ భీమవరం డీఎస్పీకి కితాబులిస్తూ మాట్లాడటం సరికాదని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. ‘ప.గో జిల్లాలో పేకాట సహజమంటూ RRR చెప్పడం వల్ల ఇక్కడి ప్రజలపై తప్పుడు భావన వెళ్లే ప్రమాదం ఉంది. డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై డిప్యూటీ సీఎం హోదాలో విచారించి నివేదిక ఇవ్వమన్నారే తప్ప ముందస్తుగా చర్యలు తీసుకోమనలేదు. దీనిపై పవన్‌తో RRR నేరుగా మాట్లాడాల్సింది’ అని అన్నారు.

News October 24, 2025

కలెక్టరేట్‌లో కంట్రోలు రూమ్‌ ఏర్పాటు: కలెక్టర్

image

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. శుక్రవారం భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించి కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో 88162 99219 ఫోన్ నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.