News February 6, 2025
భీమిలి: ఇన్స్టాలో పవన్ను తిట్టిన వ్యక్తిపై కేసు

తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో Dy CM పవన్ కళ్యాణ్ను తిడుతూ ఇన్స్టాలో పోస్టు పెట్టిన భీమిలి మండలం జీరుపేట గ్రామానికి చెందిన వ్యక్తిపై కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 2న జీరు వీరుబాబు పెట్టిన పోస్టుపై విజయవాడకు చెందిన TDP బూత్ కన్వీనర్ హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భీమిలి పోలీసుల సాయంతో గవర్నర్పేట పోలీసులు వీరబాబును బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Similar News
News March 23, 2025
కశింకోటలో యాక్సిడెంట్.. UPDATE

కశింకోట మండలం త్రిపురవానిపాలెం జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా అవతలి రోడ్డుకు వెళ్లడానికి లారీని మలుపు తిప్పాడు. అదే మార్గంలో వస్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో వెనక లారీ డ్రైవర్ షేక్ మస్తాన్ వల్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు
News March 23, 2025
విశాఖ: మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు

విశాఖలో 2021లో హత్యకు గురైన జి.శ్రీను కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులు <<15852353>>మర్డర్ మిస్టరీ<<>>ని ఛేదించారు. జీ.శ్రీను తమ్ముడు తోటయ్య దొంగలించిన ఫోన్ను లాలం గణేశ్కు అమ్మాడు. దీనిని గణేశ్ తమ్ముడు వాడగా ట్రాక్ చేసిన పోలీసులు తోటయ్యను అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం రూ.10,000 ఖర్చు అయిందని శ్రీను గణేశ్ను డబ్బులు అడిగే వాడు. దీంతో శ్రీను-గణేశ్ మధ్య వాగ్వాదం జరగ్గా.. అది హత్యకు దారి తీసినట్లు దర్యాప్తులో తేలింది.
News March 23, 2025
రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ

రుషికొండ బీచ్ తన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను తిరిగి పొందింది. రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్పై విధించిన తాత్కాలిక సస్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు ఆ సంస్థ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా బ్లూ ఫ్లాగ్ ఇండియా జాతీయ ఆపరేటర్ డాక్టర్ శ్రీజిత్ కురూప్, బ్లూ ఫ్లాగ్ ఇండియా జ్యూరీ సభ్యుడు అజయ్ సక్సేనా విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్కుఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని శనివారం అందజేశారు.