News January 17, 2025

భీమిలి: కాకరకాయ జ్యూస్ అనుకుని పురుగుమందు తాగి మృతి

image

భీమిలి ఎమ్మార్వో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న <<15172608>>ముస్తఫా<<>> ఈనెల15న ఉదయం కాకరకాయ జ్యూస్ అని భావించి పురుగుమందు తాగడంతో మృతి చెందాడు. తనకు షుగర్ వ్యాధి ఉండడంతో రోజు కాకరకాయ జ్యూస్ తాగుతాడు.14న మొక్కలకి పిచికారి చేసేందుకు పురుగుల మందు తీసుకువచ్చి గ్లాస్‌లో ఉంచాడు. ఆ విషయం మర్చిపోయి పురుగుల మందు తాగాడు. భార్య ఫాతిమా పురుగుల మందు ఏదని ప్రశ్నించడంతో తాగింది పురుగుమందు అని తెలిసింది.

Similar News

News October 29, 2025

జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్

image

జీవీఎంసీ సిటీ ఆపరేషన్ సెంటర్‌ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సందర్శించారు. సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా తుఫాను కారణంగా తీసుకుంటున్న జాగ్రత్తలను కమిషనర్ కేతన్ గార్గ్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నామని వివరించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు.

News October 28, 2025

రేపు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెలవు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బుధవారం కూడా సెలవు ప్రకటిస్తూ ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు 2 రోజులుగా తరగతులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తుఫాను నేపథ్యంలో ఉద్యోగులకు, సిబ్బందికి సైతం మంగళవారం సెలవు ప్రకటించారు. విశాఖ జిల్లాలో పాఠశాలలకు, కళాశాలలకు రేపు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏయూ అధికారులు కూడా సెలవు ప్రకటించారు.

News October 28, 2025

మరింత అప్ర‌మ‌త్తంగా ఉందాం: ప్రత్యేక అధికారి

image

మొంథా తుపాను మంగళవారం రాత్రి 10 నుంచి సుమారు 12 గంటల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రత్యేక అధికారి అజయ్ జైన్ వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు చేపట్టే ముందస్తు జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎంపీ శ్రీభరత్, తదితరులు పాల్గొన్నారు.