News February 14, 2025
భీమిలి: స్వీట్ షాప్లో కుప్పకూలి మృతి

తగరపువలసలోని ఓ స్వీట్షాప్లో మహిళ మృతిచెందింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లికి చెందిన రక్షణకుమారి కొంతకాలంగా ఓ స్వీట్ షాప్లో పనిచేస్తోంది. గురువారం సాయంత్రం ఒంట్లో బాగోలేదని ట్యాబ్లెట్ వేసుకుని షాప్కి వెళ్లింది. అక్కడ పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు. భీమిలి పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 25, 2025
విశాఖ రైతు బజార్లో నేటి కూరగాయల ధరలు

విశాఖ రైతు బజార్లలో మంగళవారం నాటి కూరగాయల ధరలు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ విధంగా నిర్ణయించారు. ఉల్లిపాయలు రూ.23, బంగాళ రూ.15, టమాటలు రూ.15, బెండకాయలు రూ.30, వంకాయలు రూ.27/32/40,కాకరకాయలు రూ.38, ఆనపకాయ రూ.14, బీరకాయలు రూ.42, క్యాబేజి రూ.12, కాలి ఫ్లవర్ రూ.20, దొండకాయలు రూ.30,బీట్ రూట్ రూ.20,పొటల్స్ రూ. 46,మునగకాడలు రూ.28, క్యారట్ రూ.20,కీరా దోసకాయ రూ.22,మామిడి కాయలు రూ.40గా నిర్ణయించారు.
News March 25, 2025
విశాఖ తీరంలో హీట్ పెంచుతున్న మేయర్ పీఠం ..!

విశాఖ తీరంలో GVMC మేయర్ పీఠం హీట్ పెంచుతోంది. మేయర్ పదవి దక్కించుకునేందుకు కూటమి కదుపుతున్న పావులను YCP తిప్పికొట్టేందుకు యత్నిస్తోంది. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి నాయకులు ఇటీవల కలెక్టర్కు వినతి ఇవ్వగా.. అలెర్ట్ అయిన వైసీపీ అధిష్ఠానం క్యాంప్ రాజకీయాలకు తెరలేపినట్లు సమాచారం. ఇప్పటికే 28 మంది YCP కార్పొరేటర్లను బెంగళూరు తరలించారు. అక్కడి నుంచి ఊటీ టూర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
News March 25, 2025
భీమిలి బీచ్లో నిర్మాణాల తొలగింపు

భీమిలి బీచ్లోని కోస్తా నియంత్రణ మండలి పరిధిలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కంపెనీ నిర్మించిన ప్రహరీ, వాటి పునాదుల తొలగింపునకు జీవీఎంసీ సుమారు రూ.కోటి వెచ్చిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని తొలగించి ఈ నెల 26 కల్లా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో జీవీఎంసీ అధికారులు విరామం లేకుండా యంత్రాలతో పనిచేయిస్తున్నారు.