News March 19, 2025
భీమ్గల్: చేపల వలలో చిక్కుకొని జాలరి మృతి

చెరువులో చేపలు పడుతూ వ్యక్తి నీటిలో మునిగి చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం సిద్దపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోపారం బొర్రన్న చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం చెరువులో చేపల వేటకు వెళ్లగా, ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని నీటిలో మునిగి చనిపోయాడని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
Similar News
News November 26, 2025
అరాచక శక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయి: TPCC చీఫ్

దేశంలో కొన్ని అరాచక శక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయని TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం NZB లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి మాట్లాడారు. విద్యావంతులు, మేధావులు అరాచక శక్తుల కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు.
గాంధీ, నెహ్రూను మరిపించి దేశ చరిత్రను తిరగరాసే కుట్ర జరుగుతుందన్నారు.
News November 26, 2025
నిజామాబాద్లో ఈ గ్రామాలు మహిళలవే..!

NZB జిల్లాలోని 545 GPల సర్పంచ్, 5022 వార్డు మెంబర్ పదవులకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఈ క్రమంలో 545 GPల్లో మహిళలకు 244 సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఇందులో STలకు 41, SCలకు 35, BCలకు 55, జనరల్ స్థానాల్లో 113 స్థానాలు కేటాయించారు. వార్డు మెంబర్లుగా 2,152 సీట్లు దక్కాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాగా మొదటి విడత మండలాల్లో రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
News November 26, 2025
నిజామాబాద్లో ఈ గ్రామాలు మహిళలవే..!

NZB జిల్లాలోని 545 GPల సర్పంచ్, 5022 వార్డు మెంబర్ పదవులకు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. ఈ క్రమంలో 545 GPల్లో మహిళలకు 244 సర్పంచ్ స్థానాలు దక్కాయి. ఇందులో STలకు 41, SCలకు 35, BCలకు 55, జనరల్ స్థానాల్లో 113 స్థానాలు కేటాయించారు. వార్డు మెంబర్లుగా 2,152 సీట్లు దక్కాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాగా మొదటి విడత మండలాల్లో రేపటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.


