News February 27, 2025

భీమ్‌గల్: సాంబార్‌లో పడి చిన్నారి మృతి

image

వేడి సాంబార్‌లో చిన్నారి పడి మృతి చెందిన విషాద ఘటన భీమ్‌గల్‌లో చోటు చేసుకుంది. SI మహేశ్ వివరాల ప్రకారం.. భీమ్‌గల్‌కి చెందిన కర్నె చార్వీక్(3) తల్లి నిహరికతో ఈ నెల 19న ముచ్కూర్‌లోని బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి సాంబార్‌ పాత్రలో పడిపోయాడు. శరీరమంతా కాలిపోగా చిన్నారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు SI వివరించారు.

Similar News

News December 3, 2025

శివ స్వాములకు ఉచిత స్పర్శ దర్శనం: ఛైర్మన్

image

శివ స్వాములకు ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేశ్ నాయుడు తెలిపారు. బుధవారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 7 వరకు స్పర్శ దర్శనాన్ని సాధారణ భక్తులకు రద్దు చేశామన్నారు. శివ స్వాములకు మాత్రం విడతల వారీగా దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులందరికీ సంతృప్తికర దర్శన భాగ్యం కల్పించటమే తన ధ్యేయమన్నారు.

News December 3, 2025

రైల్వే ట్రాక్ పై నాటు బాంబు ఘటనపై ఎస్పీ క్లారిటీ

image

కొత్తగూడెం రైల్వే ట్రాక్ పై ఉల్లిగడ్డ ఆకారంలోని నాటు బాంబును కొరికి ఒక కుక్క మృతి చెందినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని చెత్త పడేసే ప్రదేశం నుంచి కుక్క తినే పదార్థం అని భావించి అడవి జంతువులను వేటాడటానికి తయారుచేసిన నాటు బాంబును ట్రాక్ మీదకు తీసుకువచ్చి కొరకడంతో పేలి కుక్క అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. ఎవరూ కూడా ఈ విషయంపై తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.

News December 3, 2025

సమ్మిట్‌కు రావాలని కాంగ్రెస్ పెద్దలకు ఆహ్వానం

image

ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025కు హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని కోరినట్లు పెద్దపల్లి MP వంశీకృష్ణ తెలిపారు. CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, MPలతో కలిసి ఢిల్లీ వెళ్లిన వంశీకృష్ణ బుధవారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. రాష్ట్రంలోని మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి ప్రాధాన్యతపై చర్చించారు.