News December 27, 2024
భువనగిరితో మన్మోహన్ సింగ్కు అనుబంధం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు భువనగిరితో ప్రత్యేక అనుబంధం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏప్రిల్ 26న ఏర్పాటుచేసిన ప్రచార వేదిక సభకు హాజరయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మన్మోహన్ సింగ్కు స్వాగతం పలికారు. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లును పరిచయం చేశారు.
Similar News
News November 23, 2025
డీసీసీ దక్కకపోవడంపై మోహన్ రెడ్డి అసంతృప్తి

నల్లగొండ జిల్లా డీసీసీ దక్కకపోవడంపై గుమ్మల మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశించానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు వస్తాయన్నారు. నిబద్ధతతో జెండా మోసిన నాయకులకు పదవులు రావని వాపోయారు. పార్టీ ఏ కార్యక్రమాలకు పిలుపు నిచ్చిన నిబద్ధతతో పని చేశానన్నారు.
News November 23, 2025
జీఎన్ఎం శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు

నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైపరీ) శిక్షణ సంస్థల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 3 సంవత్సరాల శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గల వారు పూర్తి వివరాలు ఆన్లైన్ వెబ్ సైట్ dme.tealngana.gov.inలో చూసుకోవచ్చని సూచించారు.
News November 23, 2025
నల్గొండ: పున్నా కైలాస్ నేత రాజకీయ నేపథ్యం

మునుగోడుకు చెందిన పున్నా కైలాస్ నేత ఓయూలో చదువుకునే సమయంలోనే రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఓయూ విద్యార్థి నేతగా.. విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్లో చేరి 2018, 2023లో మునుగోడు MLA టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. 2022 నుంచి TPCC ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.


