News March 27, 2025
భువనగిరిలో ఈనెల 28న ఇఫ్తార్ విందు

భువనగిరిలో ఈనెల 28న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వైఎస్ఆర్ గార్డెన్లో ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేశ్ తెలిపారు. ముస్లింలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి మజహార్, నాయకుడు సలావుద్దీన్, ముస్లింలు పాల్గొన్నారు.
Similar News
News November 1, 2025
అమలాపురం: జిల్లా డీఐఈఓగా విజయశ్రీ

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా (డీఐఈఓ) రాజమండ్రి డీఐఈఓ డి.విజయశ్రీ శనివారం ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు డీఐఈఓగా పనిచేసిన సోమశేఖర రావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఆమె ఫుల్ అడిషనల్ ఛార్జ్ (ఎఫ్ఏసీ)గా బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా డీఐఈఓ విజయశ్రీ పేర్కొన్నారు.
News November 1, 2025
ఎర్రవల్లి: ఫుడ్ పాయిజన్ ఘటనపై హెచ్ఆర్సీ స్పందన

ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ వసతి గృహంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) శనివారం స్పందించింది. దీనిని సుమోటో కేసుగా స్వీకరించిన కమిషన్.. ఘటనపై పూర్తి విచారణ చేసి, అస్వస్థతకు గల కారణాలు, విద్యార్థుల ఆరోగ్య స్థితి, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై తీసుకున్న చర్యలతో కూడిన నివేదికను ఈ నెల 24లోపు ఇవ్వాలని సీఎస్ను కోరింది.
News November 1, 2025
పంట నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం చేస్తాం: మంత్రులు

మొంథా తుఫాన్ ప్రభావం వల్ల పంట నష్టపోయిన ప్రతి రైతుకు, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మొంథా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన పంట పొలాలు, నష్ట ప్రభావిత ప్రాంతాలపై కలెక్టర్ రాజకుమారి, అధికారులతో సమీక్షించారు. ప్రత్యేక నిధులు కేటాయించి రోడ్లను అభివృద్ధి చేస్తామని మంత్రి బీసీ తెలిపారు.


