News February 24, 2025
భువనగిరి: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో ఆదివారం జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. వీరారెడ్డిపల్లికి చెందిన మంద చంద్రయ్య అప్పుల బాధతో మనోవేదనకు గురై పంట పొలానికి తెచ్చిన పురుగు మందును తాగాడు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు.
Similar News
News October 24, 2025
జగిత్యాల: మరో ఐదు రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే అనంతలోకాలకు..!

మరో 5 రోజుల్లో పెండ్లి ఉండగా పత్రికలు పంచేందుకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పెండ్లి కొడుకు అక్కడికక్కడే మృతిచెందాడు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి సమీపంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన పెళ్లింట విషాదం నెలకొంది. జగిత్యాల మండలం సోమన్ పెళ్లికి చెందిన చెట్ల వంశీకి పెళ్లి నిశ్చయం కాగా, ఈనెల 30న పెళ్లి పెట్టుకున్నారు. ప్రమాదంలో పెళ్ళికొడుకు వంశీ మృతి చెందడం పెళ్ళంట విషాదం నింపింది.
News October 24, 2025
రేపు పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం

తిరుమలలో అక్టోబర్ 25వ తేదీన నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునిదే.
News October 24, 2025
ఓయూలో UPSC ప్రిలిమ్స్ శిక్షణ FREE

OUలోని సివిల్ సర్వీసెస్ అకాడమీలో UPSC ప్రిలిమ్స్ శిక్షణలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ డా.నాగేశ్వర్ తెలిపారు. ఈ ఉచిత శిక్షణ UPSC ప్రిలిమ్స్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటుందని ఆయన చెప్పారు. వర్సిటీ క్యాంపస్, కాన్స్టిట్యూయెంట్ కళాశాలల్లో PG, PHD చేస్తున్న వారు అర్హులు. నవంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డా.నాగేశ్వర్ సూచించారు.
SHARE IT


