News March 30, 2025
భువనగిరి: ఉగాది పచ్చడిలా జీవితం ఉండాలి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా ప్రజలకు నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయన్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్బంగా.. జిల్లా ప్రజలందరి జీవితంలో ఉగాది పచ్చడిలా షడ్రుచులు నిండి ఉండాలని, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
Similar News
News February 23, 2026
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు కలెక్టర్ దివాకరను పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మంగపేట, ముళ్లకట్ట, రామన్నగూడెం, కన్నాయిగూడెం ఘాట్లలో తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, భద్రత, పార్కింగ్ తదితర సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
News February 23, 2026
ఆదిలాబాద్లో తిరిగి ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు ఎంపీ గోడం నాగేష్ జోక్యంతో పునఃప్రారంభమయ్యాయి. కొనుగోళ్లు ఆగిపోవడంతో ఆందోళనలో ఉన్న రైతుల సమస్యను బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎంపీ, అధికారులతో మాట్లాడి ప్రక్రియను పునరుద్ధరించారు. తమకు అండగా నిలిచిన నేతలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
News February 23, 2026
డయేరియా అదుపునకు అత్యవసర చికిత్స అందించాలి: రామ్మోహన్

శ్రీకాకుళంలో డయారేయా కేసుల ఉద్ధృతిపై జిల్లా అధికారులతో మాట్లాడిన కేంద్రమంత్రి రామ్మోహన్ సోమవారం అత్యవసరంగా సమీక్షించారు. రోగులకు అత్యవసర చికిత్స అందించి, వ్యాధి ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వ్యాధి సోకడానికి గల కారణాలు అన్వేషించాలని ఆయన సూచించారు. నగరపాలక సంస్థ ప్రజారోగ్య సిబ్బంది, అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరo అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


