News April 10, 2024
భువనగిరి ఎంపీ సెగ్మెంట్పై సీఎం రేవంత్ సమీక్ష
భువనగిరి ఎంపీ సెగ్మెంట్పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. హైదరబాద్లోనిఎమ్మేల్యే రాజ్గోపాల్ రెడ్డి నివాసంలో చర్చించారు. ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మేల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్, సామెల్, మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.
Similar News
News September 30, 2024
నల్గొండ: ఏసీబీకి చిక్కిన పశు వైద్యాధికారి
చింతపల్లి మండల పశు వైద్యాధికారి జోసఫ్ పాల్ రూ.6,000 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గేదెల బ్యాంకు లోన్, హెల్త్ సర్టిఫికెట్ కోసం నసర్లపల్లికి చెందిన ఓ రైతు వద్ద రూ.8వేలు డిమాండ్ చేసి రూ.6 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్ కి ఫోన్ చేయాలని ఉమ్మడి ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు.
News September 30, 2024
NLG: కాసేపట్లో రిజల్ట్స్.. పోటీ ఇలా..
DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
NLG 3187 373 1:08
SRPT 2981 213 1:13
యాదాద్రి 742 135 1:05
News September 30, 2024
NLG: దసరాకు వినూత్నమైన ఆఫర్
తెలంగాణలో అతిపెద్ద పండగ ‘దసరా’. ఈ పండుగకు వస్త్ర, నగల వ్యాపార సంస్థలు భారీగా ఆఫర్లను పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. NLG జిల్లాలోని శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో యువకులు వినూత్నంగా ‘రూ. 200 కొట్టు మేకను పట్టు’ అనే ఆఫర్ పెట్టారు. ఈ కూపన్ ఆఫర్లో మేక, నాటు కోళ్లు, మందు బాటిళ్లు గెలిచిన వారికి బహుమతిగా ప్రకటించారు. విషయం తమ దృష్టికి వచ్చిందని కౌన్సెలింగ్ ఇస్తామని ఎస్సై సైదులు తెలిపారు.