News February 26, 2025
భువనగిరి: ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో 17 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.104 మంది పోలింగ్ సిబ్బందిని,17 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 214 మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 2, 2025
చిత్తూరు: ఖాళీ పోస్టులకు దరఖాస్తులు

చిత్తూరు సమగ్రశిక్ష శాఖ కార్యాలయంలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీసీ వెంకటరమణ కోరారు. భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల పనుల పర్యవేక్షణ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సైట్ ఇంజినీర్ పోస్టులు 3, డ్రాఫ్ట్ మెన్ పోస్టులు రెండింటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తామని.. ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
News November 2, 2025
ఆ ఓటర్లను ‘స్థానిక’ జాబితాలో చేర్చండి: SEC

TG: రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికల కసరత్తులో భాగంగా GP వార్డుల వారీగా కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని కలెక్టర్లను SEC ఆదేశించింది. గతనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి, కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించే నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఈనెల 15 వరకు నమోదయ్యే ఓటర్లను లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓట్ లిస్ట్లో చేర్చాలని సూచించింది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ముందుజాగ్రత్తగా సిద్ధం చేయాలని ఆదేశించింది.
News November 2, 2025
5న భువనగిరిలో ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు

ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన భువనగిరిలో ఉమ్మడి జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ ఆర్చరీ సెలక్షన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ఆధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి, తునికి విజయ సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు. సెలక్షన్ పోటీల్లో పాల్గొనదల్చిన క్రీడాకారులు ఆయా పాఠశాల నుంచి తమ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు చేరుకోవాలని కోరారు.


