News October 15, 2024

భువనగిరి: ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుల సమావేశంలో పాల్గొన్న ఎంపీ

image

మహారాష్ట్ర ,ఝార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ముంబైలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రమేశ్ చేన్నితల, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నానా పటోలే ఆధ్వర్యంలో జరుగుతున్న ఏఐసీసీ ఎన్నికల పరిశీలకుల సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వంశీ చందర్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 29, 2025

హైదరాబాదులో గుండ్లపల్లి మండల వాసి ఆత్మహత్య

image

నిరుద్యోగం, ఆర్థిక సమస్యలతో నల్గొండ(D) గుండ్లపల్లి(M) తవక్లాపూర్‌కు చెందిన ఆంజనేయులు(27) హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ పరీక్షల కోసం 8 నెలల క్రితం LBనగర్‌కు వెళ్లాడు. శుక్రవారం మ.1:10కి బంధువు అనిల్‌కు చనిపోతానని ఫోన్లో చెప్పాడు. విషయాన్ని వెంటనే సోదరుడు అభినందన్‌కు తెలియజేయగా అతను వెళ్లి చూసేసరికి ఉరేసుకొని కనిపించాడు. అతని సోదరుడు ఫిర్యాదు చేశాడని LBనగర్ సీఐ వినోద్ తెలిపారు.

News November 28, 2025

నల్గొండ జిల్లాలో ఇవాళ్టి టాప్ న్యూస్

image

✓మర్రిగూడ: నగదు ఎలా స్వీకరిస్తున్నారు.. ఇలా త్రిపాఠి వాకబు
✓చెర్వుగట్టు హుండీ ఆదాయం లెక్కింపు
✓చండూరు: కుల ధృవీకరణ కోసం పడిగాపులు
✓మిర్యాలగూడ: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
✓నల్గొండ: కుక్కల స్వైర విహారం.. 22 గొర్రెల మృతి
✓కట్టంగూరు: కాంగ్రెస్‌లో బయటపడ్డ వర్గ విభేదాలు
✓చిట్యాల: అప్పుడు వార్డు మెంబర్.. ఇప్పడు మండలి ఛైర్మన్

News November 28, 2025

దేవరకొండకు సీఎం రేవంత్

image

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి విచ్చేయనున్నారు. దీనిలో భాగంగా డిసెంబర్ 6వ తేదీన జిల్లాలోని దేవరకొండకి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా కాంగ్రెస్ నాయకులు సమీక్షించారు.