News April 11, 2025

భువనగిరి: గంటల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య

image

గంటల వ్యవధిలో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. రామన్నపేట మండలం నిదానపల్లిలో జింకల అంజి, కావ్య డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కావ్య గురువారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న అంజి పురుగు మందు తాగి చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూశాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 16, 2025

BREAKING: భారత ప్లేయర్ విధ్వంసం.. డబుల్ సెంచరీ

image

U-19 ఆసియా కప్‌లో భాగంగా మలేషియాతో మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అభిజ్ఞాన్ 121 బంతుల్లో డబుల్ సెంచరీ చేశారు. ఇందులో 16 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. 48వ ఓవర్‌లో అభిజ్ఞాన్, చౌహాన్ 29 పరుగులు బాదారు. వరుసగా 4, వైడ్, 6, 6, 6, వైడ్, 1, 4 రన్స్ వచ్చాయి.

News December 16, 2025

జోజినగర్ స్థలం కబ్జాలో టీడీపీ నేతల పాత్ర: వైఎస్ జగన్

image

విజయవాడ భవానిపురంలోని జోజినగర్ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రూ.150 కోట్ల విలువైన స్థలాన్ని టీడీపీ నేతలతో కలిసి కబ్జాకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 2016లో రమా సొసైటీ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, 25 ఏళ్లుగా నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం దారుణమని జగన్ అన్నారు.

News December 16, 2025

GNT: గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులు అరెస్ట్

image

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గంజాయి మూలాలను కూకటివేళ్లతో పెకలించి వేస్తున్నామని DSP అబ్దుల్ అజీజ్ అన్నారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతీనగర్ అబ్దుల్ బాబా మసీదు ఎదురు ఖాళీస్థలంలో ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు. పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేయగా కేసు వివరాలను DSP వివరించారు. వారి వద్ద నుంచి 20గ్రాముల గంజాయి, 4 గ్రాముల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.