News February 3, 2025
భువనగిరి: జోరందుకున్న వరి నాట్లు

యాదాద్రి జిల్లాలో వరి నాట్లు జోరందుకున్నాయి. యాసంగి సీజన్లో ఇప్పటివరకు 2,71,002 ఎకరాలలో వరి సాగు అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మరో 30 వేల ఎకరాలలో సాగయ్యే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. వానకాలంతో పోలిస్తే యాసంగిలో అధికంగా సాగైనట్లు చెబుతున్నారు. భువనగిరి, ఆలేరు డివిజన్ల పరిధిలో మల్లన్న సాగర్, గోదావరి జిల్లాలు వస్తుండడంతో రైతులు వరిసాగుపై మొగ్గు చూపుతున్నారు.
Similar News
News January 22, 2026
టెన్త్, ఐటీఐతో 210 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో 210 వర్క్మెన్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ITI, నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, జనరల్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: cochinshipyard.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 22, 2026
వరంగల్ మార్కెటింగ్ ఆర్జేడీ శ్రీనివాస్ బదిలీ

వరంగల్ మార్కెటింగ్ శాఖ రీజియన్ జాయింట్ డైరెక్టర్ ఉప్పుల శ్రీనివాస్ బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాద్లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం అదనపు డైరెక్టర్గా విధుల్లో ఉన్న ఆర్. లక్ష్మణుడుకు వరంగల్ ఆర్జేడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
News January 22, 2026
CSLలో 260 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్(<


