News February 4, 2025
భువనగిరి: తొలి రోజు 115 మంది డుమ్మా!

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. జనరల్ ఇంటర్ ప్రాక్టికల్స్కు 586 మందికి గాను 579 మంది హాజరు కాగా 7 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షలకు 1,564 మందికి గాను 1456 మంది హాజరుకాగా 108 మంది గైర్హాజరయ్యారు. ఈనెల 3 నుంచి 22 వరకు మూడు దఫాలుగా 2 పూటలా జరుగనున్న ప్రాక్టికల్స్కు జనరల్ ఇంటర్ సెకండ్ ఇయర్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు 6,200మంది హాజరు కావాల్సి ఉంది.
Similar News
News December 9, 2025
1500 మందితో 5 అంచెల భద్రత: సూర్యాపేట ఎస్పీ

మొదటి విడత ఎన్నికలు జరగనున్న 8మండలాల్లో మంగళవారం సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగిసిందని ఎస్పీ నరసింహా తెలిపారు. 1500 మంది సిబ్బందితో 5 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓటర్లకు ప్రలోభాలు, తప్పుడు సమాచారం, సోషల మీడియా దుర్వినియోగం, గుంపులుగా చెరడం నిషేధమని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫోన్లు నిషేధం. సమస్యాత్మక గ్రామాలపై నిఘా పెంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
News December 9, 2025
తొలి టీ20: టాస్ ఓడిన భారత్

కటక్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గాయాల నుంచి కోలుకున్న హార్దిక్, గిల్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
IND: సూర్య(C), గిల్, అభిషేక్, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్
SA: మార్క్రమ్(C), డికాక్, స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, జాన్సెన్, మహరాజ్, నోర్ట్జే, సిపామ్లా, ఎంగిడి
News December 9, 2025
సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.


