News February 4, 2025

భువనగిరి: తొలి రోజు 115 మంది డుమ్మా!

image

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. జనరల్‌ ఇంటర్‌ ప్రాక్టికల్స్‌‌కు 586 మందికి గాను 579 మంది హాజరు కాగా 7 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ పరీక్షలకు 1,564 మందికి గాను 1456 మంది హాజరుకాగా 108 మంది గైర్హాజరయ్యారు. ఈనెల 3 నుంచి 22 వరకు మూడు దఫాలుగా 2 పూటలా జరుగనున్న ప్రాక్టికల్స్‌కు జనరల్‌ ఇంటర్‌ సెకండ్ ఇయర్, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులు 6,200మంది హాజరు కావాల్సి ఉంది.

Similar News

News February 11, 2025

పిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

image

పిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా మహిళాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాలల సంక్షేమం, రక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లల సంక్షేమం, రక్షణ అందించుటలో ప్రభుత్వ శాఖలన్నీ కార్యాచరణ ప్రణాళికతో పని చేయాలన్నారు. మండల స్థాయిలో పిల్లల రక్షణ కోసం కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.

News February 11, 2025

మద్యం ధరల పెంపుతో రూ.150 కోట్ల ఆదాయం: కొల్లు

image

AP: YCP హయాంలో నకిలీ బ్రాండ్లతో మద్యం విక్రయాలు చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మద్యం డిపోలను తాకట్టుపెట్టి తెచ్చిన అప్పుల్లో ₹12K కోట్లు తాము చెల్లించామన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా లిక్కర్ విక్రయాలు చేస్తున్నామని తెలిపారు. బాటిల్‌పై రేటు ₹10 పెంచామని, దీనివల్ల ప్రభుత్వానికి ₹150 కోట్ల వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. త్వరలో నవోదయం కార్యక్రమం ద్వారా అక్రమ మద్యాన్ని అరికడతామన్నారు.

News February 11, 2025

Share it: విశాఖలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

image

పదో తరగతి అర్హతతో ఇండియన్ పోస్టల్‌శాఖలో ఉద్యోగాలకు <<15428846>>నోటిఫికేషన్ <<>>వచ్చింది. విశాఖ డివిజన్ పరిధిలో 9 ఖాళీలు ఉన్నాయి. ఆ పోస్టుల వివరాలు ఇవే..
➤ అనంతవరం(GDS ABPM)-ఓపెన్
➤ ఆరిలోవ(GDS ABPM)-EWS
➤ గాజువాక(DAKSEVAK)-ఓపెన్
➤ H.B కాలనీ(GDS ABPM)-ఓపెన్
➤ మజ్జివలస(GDS BPM)-ఓపెన్
➤ పినగాడి(GDS BPM)-ఎస్టీ
➤ పొట్నూరు(GDS BPM)-ఓపెన్
➤ రాంపురం(GDS BPM)-ఎస్సీ
➤ సుజాతా‌నగర్(DAKSEVAK)-ఓపెన్

error: Content is protected !!