News April 8, 2025
భువనగిరి: పెరిగిన గ్యాస్ ధరలు.. రూ.1.25 కోట్ల భారం !

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్పై రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. సిలిండర్ ప్రస్తుతం రూ.853 ఉండగా పెరిగిన ధరతో రూ.903కు చేరింది. యాదాద్రి జిల్లాలో 2,49,568 గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. దీంతో గ్యాస్ వినియోగదారులపై సుమారు రూ. 1.25 కోట్ల భారం పడనుంది. ఇది ఉజ్వల పథకం సిలిండర్లకు మాత్రమే వర్తించనుంది. నిత్యావసరాల ధరలు పెరిగిన వేళ.. గ్యాస్ ధర పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
Similar News
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


