News February 3, 2025

భువనగిరి: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

ఫిబ్రవరి ప్రారంభంలోనే ఎండలు మొదలయ్యాయి. పగటి ఉష్ణోగ్రత జనవరి 31న 31.1 డిగ్రీలు నమోదు కాగా, అదివారం 35.8 డిగ్రీలకు చేరింది. మూడు రోజుల వ్యవధిలోనే 4.7 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగినట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎండ తీవ్రతకు ఉక్కపోత కూడా తోడవడంతో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీ, కూలర్ల వాడకం పెరుగుతోంది. దీని వల్ల విద్యుత్ వినియోగం అధికమైంది.

Similar News

News February 26, 2026

37 రాజ్యసభ స్థానాలు.. నామినేషన్లు షురూ

image

దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. చివరి తేదీ మార్చి 5. నిర్ణీత స్థానాల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో మార్చి 16న 9AM నుంచి 5PM వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి ఫలితాలు వెల్లడిస్తారు. మహారాష్ట్ర-7, TN-6, బిహార్-5, బెంగాల్-5, ఒడిశా-4, అస్సాం-3, <<19214239>>TG-2<<>>, ఛత్తీస్‌గఢ్-2, హరియాణా-2, హిమాచల్‌-ఒక సీటుకు ఎన్నికలు జరగనున్నాయి.

News February 26, 2026

జనగామ: ‘ఆర్టీసీ సేవల్లో సమస్యలా.. రేపు ఫోన్ చేయండి’

image

ఆర్టీసీ బస్సు సర్వీసులపై సమస్యలు, సూచనలు స్వీకరించేందుకు శుక్రవారం జనగామ డిపోలో “డయల్ యువర్ డీఎం” కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం ఎస్. స్వాతి తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 9959226050 నంబర్‌కు ఫోన్ చేసి బచ్చన్నపేట, పాలకుర్తి సహా పలు మండలాల ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.

News February 26, 2026

GNT: గురుకుల్లాల్లో ప్రవేశాలు.. పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

AP గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గురువారం కలెక్టరేట్‌లో పోస్టర్‌ను విడుదల చేశారు. 5వ తరగతిలో ప్రవేశానికి, 6,7, 8  తరగతులలో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశానికి, ఇంటర్మీడియట్, డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మార్చి 31 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు చేయవచ్చన్నారు.