News January 31, 2025
భువనగిరి: పొంగుతున్న వాగులపై పొలిటికల్ వార్

యాదాద్రి జిల్లాలో మల్లన్న సాగర్ నుంచి వచ్చే సాగునీటితో కొన్నిచోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ కామెంట్స్ నడుస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివద్ధి వల్లే రైతులకు సాగు నీరు సమృద్ధిగా లభిస్తోందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. బీఆర్ఎస్ వదిలేసిన పనులను పూర్తి చేసి నీళ్లు ఇస్తున్నామని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఇంతకీ మీరేమంటారు.
Similar News
News December 6, 2025
హోంగార్డుల సేవలు అనిర్విచనీయం: కాకినాడ ఎస్పీ

శాంతిభద్రతల పరిరక్షణతోపాటు అనేక ఇతర శాఖలలో హోంగార్డులు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలో హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో వారు పోలీసు శాఖకు వెన్నెముకలా నిలబడి ఉత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.
News December 6, 2025
కార్డియాలజిస్టుల నియామకానికి కృషి: మంత్రి సుభాష్

కాకినాడ GGHలో కార్డియాలజీ విభాగంలో వైద్యుల నియామకం చేపట్టేందుకు కృషి చేస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శనివారం ఆయన GGHను ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు వార్డులను పరిశీలించారు. కార్డియాలజిస్టులు లేని విషయాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
News December 6, 2025
ఐక్యమత్యంతో ర్యాంకింగ్కు కృషి చేద్దాం: JNTU వీసీ

అనంతపురం JNTUలోని ఆర్యభట్ట ఆడిటోరియంలో శనివారం “Strategic RoadMap For Improving NIRF rankings” అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు, APSCHE వైస్ ఛైర్మన్ విజయ భాస్కర్ రావు పాల్గొన్నారు. వీసీ మాట్లాడుతూ.. ఐక్యమత్యంతో యూనివర్సిటీ ర్యాంకింగ్కు కలిసిగట్టుగా కృషి చేయాలని బోధనా సిబ్బందికి సూచించారు.


