News March 20, 2025
భువనగిరి: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు..

జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు జరిగిన కెమిస్ట్రీ, వాణిజ్య శాస్త్రం పరీక్షలకు 6,395 మంది విద్యార్థులకు గాను 6,035 మంది హాజరయ్యారు. 360 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. హాస్టళ్లు, అద్దె ఇళ్లలో ఉంటున్న విద్యార్థులు స్వగ్రామాలకు బాటపట్టారు. దీంతో భువనగిరి ఆర్టీసీ బస్టాండ్ రద్దీగా కనిపించింది.
Similar News
News October 30, 2025
వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న అరెస్ట్..!

టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో ఒంగోలు మాజీ ఎంపీ, మాజీ TTD చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నను నిన్న రాత్రి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న బోలెబాబా డెయిరీ వేరొక డెయిరీని ముందు పెట్టి.. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలిసినా కమీషన్ల కోసం అంతా సైలెంట్ అయ్యారనే ఆరోపణలపైనా సిట్ విచారణ సాగిస్తుంది. ఈ క్రమంలో అప్పన్నను అరెస్ట్ చేశారు.
News October 30, 2025
సికింద్రాబాద్.. మరిన్ని రైళ్లు CANCEL

మొంథా తుఫాన్ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లను పార్షికంగా రద్దు చేస్తున్నట్లు SCR ప్రకటించింది. గుంటూరు సికింద్రాబాద్ 12705 పూర్తిగా క్యాన్సిల్ చేశారు. సికింద్రాబాద్- గుంటూరు రైలును 12706 వరంగల్ నుంచి గుంటూరు మధ్యలో క్యాన్సిల్ చేశారు.12701 గుంటూరు- సికింద్రాబాద్ రైలు డోర్నకల్ సికింద్రాబాద్ మధ్యలో క్యాన్సిల్ చేశారు.
News October 30, 2025
వనపర్తి జిల్లాలో 5 బ్లాక్ స్పాట్లు..!

జాతీయ రహదారి-44 రక్తసిక్తం అవుతోంది. ఇటీవలే కర్నూలులో జరిగిన ఘటన ఉలిక్కిపడేలా చేసింది. వాహన చోదకుల అతివేగం, ఓవర్ టెక్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని జాతీయ రహదారి నిర్వాహకులు పోలీసులు పేర్కొంటున్నారు. వనపర్తి జిల్లాలో వెల్టూరు ఎక్స్ రోడ్స్, కనిమెట్ట, మదర్ థెరిసా కూడలి, అమడబాకుల కూడలి, తోమాలపల్లి ప్రాంతాలను జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లుగా అధికారులు గుర్తించారు.


