News February 27, 2025

భువనగిరి: ఫోన్ పే, గూగూల్ పే ద్వారా బస్ టికెట్

image

TGSRTC బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఐ-టిమ్స్ మెషీన్లను ప్రవేశపెట్టనుంది. తొలి విడతలో భాగంగా 310 మెషీన్లను కొనుగోలు చేసింది. దీంతో తమకు చిల్లర బాధలు తప్పుతాయని యాదగిరిగుట్ట బస్ స్టేషన్ నుంచి ప్రయాణించేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 4, 2025

VJA: భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు నజరానా

image

భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రోత్సాహకంగా భారీ నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జట్టుకు రూ.10 లక్షల చెక్కును కెప్టెన్ దీపికకు అందజేశారు. ఫైనల్‌లో కీలక పాత్ర పోషించిన పొంగి కరుణా కుమారికి రూ. 5 లక్షలు, జట్టు కోచ్ అజేయ్ కుమార్ రెడ్డికి రూ.1 లక్షను ఏసీఏ ప్రదానం చేసింది.

News December 4, 2025

ఖమ్మం నేతల ప్రస్థానం.. సర్పంచ్‌ నుంచే రాష్ట్ర రాజకీయాలకు!

image

నేటి రాజకీయాల్లో సర్పంచ్‌ పదవి అత్యంత కీలకమనడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రే దీనికి నిదర్శనం. రాంరెడ్డి వెంకటరెడ్డి, వనమా వెంకటేశ్వరరావు వంటి సీనియర్‌ నేతలు మొదట సర్పంచ్‌లుగా గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగారు. అలాగే, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావు, సున్నం రాజయ్య సైతం సర్పంచ్‌ నుంచే ఎమ్మెల్యేలుగా గెలుపొందడం ఈ పదవి ప్రాధాన్యతను తెలియజేస్తోంది.

News December 4, 2025

మూలపేట పొర్టు నిర్మాణంపై అప్‌డేట్

image

టెక్కలి నియోజకవర్గం మూలపేట పోర్టు నిర్మాణం జాప్యం అవుతోంది. దీని వ్యవధిని 2026 నవంబర్‌కు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రూ. 2949.70 కోట్లతో విశ్వసముద్ర పోర్టు కాంట్రాక్ట్ సంస్థ పనులను 2023 ఏప్రిల్‌లో ప్రారంభించింది. కాంట్రాక్టర్ గడువు ఈ ఏడాది అక్టోబర్ 17తో ముగిసింది. పెండింగ్ పనుల దృష్ట్యా కట్టడాల కాలపరిమితిని పెంచుతూ తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.