News February 9, 2025
భువనగిరి: భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రద్దు

భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను నేటి నుంచి 20వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు ప్రయాణించే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను కాజీపేట – ఖమ్మం – విజయవాడ మధ్య మూడో ట్రాక్ లైన్ పనుల కారణంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, ప్రజలు గమనించగలరని కోరారు.
Similar News
News December 6, 2025
నిర్మల్: ముగిసిన మూడవదశ నామినేషన్ ప్రక్రియ

నిర్మల్ జిల్లాలో మూడవ దశ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఐదు మండలాల్లో మొత్తం 714 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసినట్లు అడిషనల్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ డీపీఓ ప్రకటనలో తెలిపారు. చివరి రోజు అత్యధికంగా కుబీర్ మండలంలో 116 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఐదు మండలాల్లో 133 సర్పంచ్ స్థానాలకు 714 మంది పోటీ పడుతున్నారు.
News December 6, 2025
నిజమైన భక్తులు ఎవరంటే?

ఏదో ఆశించి భగవంతుడిని సేవించేవారు వ్యాపారస్తులు. వారు తమ కోరికల కోసం దేవునికి డబ్బు ఇచ్చి బదులుగా ఏదో ఆశిస్తారు. కానీ ఫలాపేక్ష లేకుండా స్వామిని కొలిచేవారే నిజమైన భక్తులు. మనం అడగకుండానే దేవుడు కరుణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాలన్నీ ఆయన భగవతం ద్వారానే ధరించాడు. ఇదే నిస్వార్థ భక్తి. మనం ఏమీ ఆశించకుండా మన శక్తి మేరకు సత్కార్యాలు చేస్తూ, ఆ ఈశ్వరుడిని అందరిలో చూస్తూ సంతోషాన్ని పంచాలి. <<-se>>#Daivam<<>>
News December 6, 2025
HYD: ఓఆర్ఆర్పై ప్రమాదాలు తగ్గించేందుకు ఏఐ టెక్నాలజీ

ఓఆర్ఆర్పై అతివేగం, రాంగ్సైడ్ పార్కింగ్, డ్రైవర్ల నిర్లక్ష్యం వంటి కారణంగా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటి నివారణకు సైబరాబాద్ పోలీసులు, హెచ్ జీసీసీలు సంయుక్తంగా కార్యాచరణ దిగి 24 గంటల పాటు ఔటర్పై నిఘా ఉంచేందుకు ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 14 ప్రాంతాల్లో మల్టీ వయలేషన్ డిటెక్షన్ సిస్టమ్లను ఏర్పాటు చేయనున్నారు.


