News March 28, 2025
భువనగిరి: రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి

యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్పై వెళ్తున్న వ్యక్తి వెనుక నుండి ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గౌరాయపల్లికి చెందిన కైరంకొండ హరీష్ (26)గా గుర్తించారు. 108 వాహనంలో భువనగిరి ఏరియా హాస్పిటల్కు తీసుకెళ్లగా చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.
Similar News
News December 1, 2025
కాక రేపుతున్న నరసరావుపేట రాజకీయాలు.!

రాజకీయ చైతన్యానికి మారుపేరైన నరసరావుపేట వైసీపీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేశ్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యేగా గోపిరెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు పట్టణంలో పట్టు కోసం పావులు కదుపుతున్నారు. ఈ ప్రాంతంలో 90 సంవత్సరాలుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని, నరసరావుపేటను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాసు ఘాటగా స్పందించారు.
News December 1, 2025
GNT: శీతాకాల సమావేశాలు.. ఎంపీ స్టాండ్ ఏంటి.!

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధానంగా అమరావతి రాజధాని అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫండింగ్ & ప్రాజెక్టులు, పోలవరం, అమరావతి క్యాపిటల్ రీజన్ అభివృద్ధి నిధులు, రైల్వే & రోడ్ ప్రాజెక్టుల పెండింగ్ నిధులు, నూతన ప్రాజెక్టులపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.
News December 1, 2025
వరంగల్: హెచ్ఐవీ కేసులు ఆందోళనకరం!

జిల్లాలో ఇప్పటి వరకు 5,464 మంది హెచ్ఐవీ బాధితులు నమోదు కాగా, వీరిలో 4,558 మందికి ప్రభుత్వం ప్రతి నెల ఉచిత మందులు అందిస్తోంది. 863 మంది బాధితులకు ఏఆర్జే ద్వారా నెలకు రూ.2,016 పెన్షన్ ఇస్తున్నారు. నెలకు సగటున 36 కొత్త హెచ్ఐవీ కేసులు వెలుగులోకి వస్తుండటం, గర్భిణులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో హై రిస్క్ వ్యక్తులు 3,498 మంది ఉన్నారు.
#నేడు ప్రపంచ ఎయిడ్స్ డే.


