News March 16, 2025
భువనగిరి: రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. మహిళ మృతి

భువనగిరి శివారు రాయగిరి నేషనల్ హైవే 163పై రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లీకూతుర్లు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కూతురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 26, 2025
HYD: పొలిమేర దాటి పోయాడు.. పదిలంగా రావాలని!

ప్రాణం విలువ, బంధం విలువ తెలిపే ఫొటో ఇది. అమీర్పేట-కృష్ణానగర్ రూట్లో కనిపించిన ఈ దృశ్యం ఆలోచింపజేస్తోంది. ఓ వాహనం వెనుక అంటించిన కొటేషన్ ఇతర వాహనదారుల వేగాన్ని తగ్గించి, బాధ్యతను గుర్తుచేస్తోంది. ఓ నారీ దిగాలుగా ఇంటి వద్ద కూర్చొని బయటకి వెళ్లిన తన వాళ్ల కోసం ఎదురుచూస్తుంది. ‘పొలిమేర దాటి పోయాడు.. పదిలంగా ఇంటికి ఎప్పుడొస్తాడో’ అన్నట్లు ఉంది. ఈ కొటేషన్ అందరి గుండెను హత్తుకుంది.
News October 26, 2025
HYD: పొలిమేర దాటి పోయాడు.. పదిలంగా రావాలని!

ప్రాణం విలువ, బంధం విలువ తెలిపే ఫొటో ఇది. అమీర్పేట-కృష్ణానగర్ రూట్లో కనిపించిన ఈ దృశ్యం ఆలోచింపజేస్తోంది. ఓ వాహనం వెనుక అంటించిన కొటేషన్ ఇతర వాహనదారుల వేగాన్ని తగ్గించి, బాధ్యతను గుర్తుచేస్తోంది. ఓ నారీ దిగాలుగా ఇంటి వద్ద కూర్చొని బయటకి వెళ్లిన తన వాళ్ల కోసం ఎదురుచూస్తుంది. ‘పొలిమేర దాటి పోయాడు.. పదిలంగా ఇంటికి ఎప్పుడొస్తాడో’ అన్నట్లు ఉంది. ఈ కొటేషన్ అందరి గుండెను హత్తుకుంది.
News October 26, 2025
అధికారులు ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలి: కలెక్టర్

వాయుగుండం ప్రభావం నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది తప్పనిసరిగా ప్రధాన కేంద్రంలోనే ఉండాలని కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. సచివాలయ సిబ్బంది వారి సచివాలయం ఫరిధిలోనే ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసర ఫోన్ నంబర్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను, పూరి గుడిసెలలో ఉన్న కుటుంబాలను పునరావాస కేంద్రాలు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.


