News March 16, 2025
భువనగిరి: రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. మహిళ మృతి

భువనగిరి శివారు రాయగిరి నేషనల్ హైవే 163పై రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లీకూతుర్లు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కూతురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 17, 2026
KNR: తిరుపతి వెళ్లేవారికి గుడ్ న్యూస్

KNR నుంచి తిరుపతికి రైలు ద్వారా వెళ్లేవారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వరుసగా గురువారం-ఆదివారం వరకు 4గు రోజుల పాటు KNR నుంచి తిరుపతికి రైలు నడువనంది. నాందేడ్ – ధర్మవరం(శుక్రవారం), నాందేడ్ – తిరుచానూరు (శనివారం) రైళ్లను రెగ్యులర్ చేశారు. కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట స్టేషన్లో ఆగుతుంది. దీంతో పాటు KNR – TRTY SF Exp గురు, అది వారాల్లో నడుస్తుంది.
News April 17, 2026
పాలమూరు: TCC దరఖాస్తుల ఆహ్వానం

లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(TCC)లో భాగంగా 42 రోజుల వేసవి శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పరీక్షల విభాగం సంచాలకుడు పీవీ శ్రీహరి తెలిపారు. వయస్సు 18-45 ఉన్నవారు ఈనెల 18 నుంచి డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ ఏడాది కొత్తగా మహబూబ్నగర్లో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, వచ్చే నెల నుంచి టైలరింగ్, డ్రాయింగ్, సంగీతంలో శిక్షణ ఉంటుందన్నారు.
News April 17, 2026
మహబూబ్నగర్లో ఈ నెల 18న ఉద్యోగ మేళా

మహబూబ్నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 18న ఉదయం 10:30 గంటలకు ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ పిల్లలమర్రి రోడ్డులో ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి ఆపై చదివిన 18-30 ఏళ్ల యువత 6 ప్రైవేట్ సంస్థల్లో 250 ఖాళీల భర్తీకి అర్హులని జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ తెలిపారు. ఆసక్తి గలవారు సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 8919380410 నంబర్ను సంప్రదించాలని కోరారు.


