News February 6, 2025
భువనగిరి లాడ్జీల్లో పోలీసుల తనిఖీ

భువనగిరిలోని పలు లాడ్జీలను తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివేరా, డాల్ఫిన్, ఎస్వీ, ఎస్ఆర్ లాడ్జీలను చెక్ చేశామన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటున్నారా అని లాడ్జి యాజమాన్యాన్ని ఆరా తీసినట్లు చెప్పారు. MLC ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లైతే తమకు సమాచారం అందించాలన్నారు. సీఐ సురేశ్ కుమార్, ఎస్సైలు లక్ష్మీనారాయణ, కుమారస్వామి పాల్గొన్నారు.
Similar News
News December 5, 2025
ప.గో: తల్లిని కాపాడిన కొడుకు

భీమవరం మండలం జొన్నలగురువు గ్రామానికి చెందిన ఎన్.దీక్షిత్ సమయస్ఫూర్తి ప్రదర్శించి తన తల్లి ప్రాణాలను కాపాడాడు. శుక్రవారం ఎంపీపీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్కు దీక్షిత్ తన తల్లిని పిలవడానికి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆమె విద్యుత్ షాక్కు గురై ఉండటాన్ని గమనించాడు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో తల్లికి పెను ప్రమాదం తప్పింది. దీక్షిత్ను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
News December 5, 2025
కామారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికలపై కలెక్టర్ సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి దశ ఏకగ్రీవ సర్పంచి, ఉప సర్పంచి, వార్డులతో పాటు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై వచ్చిన 7 ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశించారు. ఎన్నికల పారదర్శకత, నిబంధనల అమలుకు సమయానుసార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News December 5, 2025
వృద్ధులు, దివ్యాంగుల కోటా పెంచలేం: TTD ఈవో

ఆన్లైన్లో రూ.300 దర్శన టికెట్లను తగ్గించి.. వృద్ధులు, వికలాంగులకు ఎక్కువ కేటాయిస్తే బాగుంటుందని చెన్నైకి చెందిన శ్రీనివాస్ డయల్ యువర్ TTD ఈవోలో కోరారు. వృద్ధుల కోటాను పెంచుతూ పోతే క్యూలైన్ల నిర్వహణ కష్టతరమవుతుందని ఈవో సింఘాల్ చెప్పారు. అన్నప్రసాద కేంద్రంలో వృద్ధులతో వెళ్లినప్పుడు వెయిటింగ్ టైం ఎక్కువగా ఉంటోందని హైదరాబాద్కు చెందిన సువర్ణ కోరగా.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఈవో చెప్పారు.


