News February 23, 2025

భువనగిరి: వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే సూసైడ్

image

వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మోటకొండూర్ మండలం అమ్మనబోలులో జరిగింది. ఎస్సై వివరాలిలా.. జటంగి మహేశ్ యాదవ్ (28) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబీకులు మార్చి 2న మహేశ్ వివాహం నిశ్చయించారు. శుక్రవారం మహేశ్ తన ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News October 22, 2025

NLG: ఆ ఊరిలో ఒక్క బెల్టు షాపు లేదు

image

తిప్పర్తి మండలంలోని కాశివారిగూడెం గ్రామం ఒక్క బెల్టు షాపు కూడా లేని ఆదర్శంగా నిలిచింది. గ్రామ పెద్దలు, యువత, మహిళలు ఏకమై గ్రామంలో మద్యం అమ్మకాలపై పూర్తిగా నిషేధం విధించి, కఠిన చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా గ్రామం ప్రశాంతంగా, శుభ్రంగా మారింది. స్వచ్ఛమైన జీవన విధానానికి నిదర్శనంగా నిలుస్తున్న కాశివారిగూడెం గ్రామం, ఇతర గ్రామాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

News October 22, 2025

మహబూబ్‌నగర్: కురుమూర్తి రాయుడి పేరు వెనుక కథ ఇదీ..!

image

కురుమూర్తి క్షేత్రంలో కొలువైన శ్రీహరి పేరుకు మూలం కురుమతి అని పండితులు భావిస్తున్నారు. “కురు” అనగా ‘చేయుట’, “మతి” అనగా ‘తలచుట’ అని అర్థం. అంటే, కోరిన కోరికలు తీర్చే తలంపు ఈ క్షేత్రానికి ఉందని అర్థం. కాలక్రమంలో ఈ పేరు “కురుమూర్తి”గా మారిందని, ఇక్కడ శ్రీహరి మూర్తి రూపంలో స్వయంగా కొలువై ఉండటంతో ఈ పేరు ప్రసిద్ధి చెందిందని సాహిత్యకారులు విశ్లేషిస్తున్నారు. నేడు స్వామివారి కళ్యాణం జరిగింది.

News October 22, 2025

హనుమకొండలో ధాన్యం అక్రమాలు

image

HNK జిల్లా శాయంపేట, కాట్రపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు తీసుకున్నారు. వీవోఏ బలభద్ర హైమావతి, అల్లె అనితలు మిల్లర్‌తో కలసి కోట్లలో అక్రమాలకు పాల్పడ్డట్లు బయటపడ్డాయి. ఈ కేసులో 21 మందిపై శాయంపేట స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వీవోఏలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శాఖా చర్యలతో విధుల నుంచి తొలగించి, సీసీలకు నోటీసులు ఇచ్చారు.