News February 23, 2025
భువనగిరి: వారం రోజుల్లో పెళ్లి.. అంతలోనే సూసైడ్

వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మోటకొండూర్ మండలం అమ్మనబోలులో జరిగింది. ఎస్సై వివరాలిలా.. జటంగి మహేశ్ యాదవ్ (28) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కుటుంబీకులు మార్చి 2న మహేశ్ వివాహం నిశ్చయించారు. శుక్రవారం మహేశ్ తన ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News September 17, 2025
GNT: మణికంఠ హత్యకేసులో ముద్దాయిల అరెస్ట్

గుంటూరు సంగడిగుంటలో మణికంఠ(27)పై దాడిచేసి అతని మరణానికి కారణమైన 11 మంది నిందితులను లాలాపేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చుట్టుగుంటకు చెందిన యర్రం యశ్వంత్కి, మణికంఠతో పాతకక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో యశ్వంత్ ఈ నెల 8న మణికంఠతో గొడవపెట్టుకొని అతని స్నేహితులతో కలిసి దాడి చేయగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి తండ్రి హనుమంతరావు ఫిర్యాదుమేరకు నిందితులను అరెస్ట్ చేశారు.
News September 17, 2025
వరిధాన్యం రవాణాకు సహకరించండి: DTO

ఖరీఫ్ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు సహకరించాలని లారీ, ట్రాక్టర్ యజమానులకు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం సమీప రైతు సహాయక కేంద్రాల్లో తమ బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సహకరించిన వాహన యజమానులకు రవాణా ఛార్జీలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.
News September 17, 2025
తెలంగాణ విమోచనంలో ఉమ్మడి KNR జిల్లా యోధులు

TG సాయుధ పోరాటంలో ఉమ్మడిKNR జిల్లా వీరులది కీలకపాత్ర. నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటానికి వీరులగడ్డ కేంద్రంగా నిలిచింది. అనభేరి ప్రభాకర్ రావు, బద్దం ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, సింగిరెడ్డి అంజిరెడ్డి, బోయినపల్లి వెంకటరావు, దేశిని చిన్నమల్లయ్య లాంటి ఎందరో యోధులు నిజాం నిరంకుషత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. TG సాయుధ పోరాటం వంటి ఉద్యమాల్లో పాల్గొని నిజాంకు సవాలు విసిరారు.