News March 28, 2025

భువనగిరి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

image

ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈబిసి, మైనార్టీ విద్యార్థులు పోస్టుమట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు గడువు ఈనెల 31 వరకు పొడిగించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వసంతకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News November 14, 2025

నేడు ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు

image

లక్ష్మీదేవి విగ్రహాల్లో వ్యూహలక్ష్మి ప్రతిమను దర్శించుకుంటే భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ దివ్య రూపం తిరుమల శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉంటుంది. స్వామివారి సమస్త జగత్తును పాలించే పరాశక్తి స్వరూపాన్ని హృదయంలో ధ్యానించడం వలన అఖండమైన ఐశ్వర్యంతో పాటు, ధైర్యం, జ్ఞానం వంటి అష్టైశ్వర్యాలు సిద్ధించి, సమస్త దోషాలు తొలగిపోతాయట. ఈ రూపంలో అమ్మను ‘త్రిభుజా’ అని పిలుస్తారు.

News November 14, 2025

వైజాగ్‌కు మదర్‌సన్ ఐటీ కంపెనీ

image

మదర్‌సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ (MTSL) కంపెనీ ₹109.73 కోట్ల పెట్టుబడితో వైజాగ్‌లో ఐటీ R&D, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటుకు AP ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మధురవాడ (కాపులుప్పాడ ఐటీ పార్క్)లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్ట్ ద్వారా AI/ML, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో 700 ఉద్యోగాలు వస్తాయి. AP IT & GCC పాలసీ 4.0 కింద G.O.MS.No. 61 (12-11-2025) జారీ చేసింది.

News November 14, 2025

కొనుగోలు కేంద్రాల్లో వరికి మంచి ధర రావాలంటే..

image

వరి కోత, నూర్పిడి సమయంలో ధాన్యంలో తేమశాతం 23 నుంచి 26 శాతం వరకు ఉంటుంది. అప్పుడు ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై పలుచగా ఆరబెడితే గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యతగా ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో మంచి ధర రావాలంటే ధాన్యంలో బెరుకు గింజలు 6%, తేమశాతం 17%, పుచ్చిపోయిన గింజలు 5%, ఇతర వ్యర్థ పదార్థాలు 1%, పక్వానికి రాని గింజలు 3% గరిష్ఠ స్థాయి మించకుండా ఉండేలా చూసుకోవాలి.