News March 23, 2025
భువనగిరి: వీధి కుక్కల బీభత్సం.. వృద్ధుడికి తీవ్ర గాయాలు

భువనగిరి మండలం తాజ్పూర్లో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ముగ్గురిలో వృద్ధుడైన మౌలానా తలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వీధి కుక్కల బెడడను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో నిత్యం ఎక్కడో చోట ప్రజలు కుక్కకాటుకు గురవుతున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరతున్నారు.
Similar News
News September 17, 2025
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్గా ప్రొఫెసర్ రత్న షీలామణి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్, ఆంగ్ల విభాగ ఆచార్యులు ప్రొఫెసర్ కె.రత్న షీలామణి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ఈ నియామకంపై వర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు రత్న షీలామణికి అభినందనలు తెలిపారు.
News September 17, 2025
మావోయిస్టుల సంచలన ప్రకటన.. ఆయుధాలు వదిలేస్తామని లేఖ

తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేసి, ఎన్కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. CPI మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ స్టేట్మెంట్ రిలీజైంది. కాగా అమిత్ షా 2026 మార్చి లోపు భారత గడ్డపై మావోయిస్టులను ఉండనివ్వబోమని డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే. ఇది భద్రతా బలగాలకు అతిపెద్ద విజయం అని విశ్లేషకులు చెబుతున్నారు.
News September 17, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ పోటీ

త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జవాన్ కిసాన్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేషనల్ కో-ఆర్డినేటర్ ఎస్ మోహన్ రావు తెలిపారు. మంగళవారం బషీర్బాగ్లో పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత జెన్ని మహంతి శ్రీనివాస్ పోటీ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అవినీతి లేని సమాజ నిర్మాణమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.