News February 7, 2025
భువనగిరి: వెటర్నరీ డాక్టర్పై అడవి దున్న దాడి

యాదాద్రి జిల్లాలో కొన్ని రోజుల నుంచి అడవి దున్న హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం చౌటుప్పల్ మండలం చిన్న కొండూరులో ప్రత్యక్షమవగా సాయంత్రం వలిగొండ శివారులో కనిపించింది. ఫారెస్ట్ అధికారులు దున్నను పట్టుకునే ప్రయత్నంలో చేయగా జూడా సజావుద్దీన్ అనే వ్యక్తిపై దాడి చేసినట్లు డీఎఫ్ఓ పద్మజారాణి తెలిపారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించామన్నారు.
Similar News
News December 2, 2025
మచిలీపట్నం లేదా పెడన నుంచి పోటీకి రెడీ..!

జనసేన నాయకుడు కొరియర్ శ్రీను టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే తాను మచిలీపట్నం లేదా పెడన నుంచి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు. దీంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో టికెట్ సమీకరణపై ప్రభావం చూపుతుందనే చర్చ జనసేన వర్గాల్లో నడుస్తోంది.
News December 2, 2025
పింఛన్ల రద్దు అని వైసీపీ ట్వీట్.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ

AP: పింఛన్లు రద్దు చేస్తున్నారని YCP చేసిన ట్వీట్పై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. పెన్షన్లలో కోతలేదని.. ఈ నెల 8,000 మందికి కొత్తగా మంజూరు చేసినట్లు తెలిపింది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలోనే రూ.50,763 కోట్లు పింఛన్లకే ఖర్చు చేసిందని పేర్కొంది. డిసెంబర్లో 63.25 లక్షల మందికి రూ.2,739 కోట్లు అందించిందని వెల్లడించింది. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరించింది.
News December 2, 2025
ఏలూరు: నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశారు.!

ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన భీమడోలు మండలం పూళ్ళ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పాతాళ నాగరాజుకు, కొండ్రు ఇస్సాకు అనే వ్యక్తికి పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇస్సాకు అతని కుటుంబానికి చెందిన మరో వ్యక్తి సాయంతో నాగరాజుపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణం అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


