News March 18, 2025

భువనగిరి: హాస్టళ్లలో ఫిర్యాదు బాక్స్‌ల ఏర్పాటుకు సిద్ధం

image

సంక్షేమ వసతిగృహాలు, కస్తూర్భాగాంధీ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని చోట్ల ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేయనున్నారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను రాసి విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదుల పెట్టెలో వేయోచ్చు. కలెక్టర్ తనిఖీలకు వచ్చినప్పుడు, వారంలో ఒకసారి పెట్టెను తెరిచి అందులోని ఫిర్యాదులను చూసి పరిష్కారం చూపుతారు. కలెక్టరేట్లో ఫిర్యాదు పెట్టెలు సిద్ధంగా ఉన్నాయి.

Similar News

News March 18, 2025

మే 20న దేశవ్యాప్త సమ్మె

image

లేబర్ కోడ్ రద్దు, ప్రైవేటీకరణ నిలిపివేయాలని కేంద్రాన్ని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కనీస జీతం ₹26Kకు పెంచాలని, EPS కింద ₹9K పెన్షన్ ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో సంప్రదింపులు జరపాలని కోరుతున్నాయి. ఈ మేరకు మే 20న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ రెండు నెలలపాటు కార్మికుల సమస్యలపై అన్నిరాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నాయి.

News March 18, 2025

ఎల్లనూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల షెడ్యూల్

image

ఎల్లనూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అర్చనలు నిర్వహించారు. ☛ 18న సింహ వాహనం ☛ 19న శేష వాహనం ☛ 20న హనుమంత వాహనం☛ 21న గరుడ వాహనం☛ 22న కళ్యాణోత్సవం☛ 23న రథోత్సవం☛ 24న అశ్వ వాహనం☛ 25న వసంతోత్సవం, హంస వాహనం☛ 26న ఏకాంతోత్సవం

News March 18, 2025

కాకినాడ: పవన్ కళ్యాణ్‌తో ఎమ్మెల్సీ తోట..హాట్ టాపిక్

image

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలయిక మంగళవారం చోటుచేసుకుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ముగింపు సందర్భంగా జరిగిన ఫోటోస్ స్టేషన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ త్రిమూర్తులు ఒకరికొకరు తారసపడ్డారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తోట త్రిమూర్తులను పలకరించారు. ఇప్పటికే పెండెం దొరబాబు జనసేనలో చేరారు.

error: Content is protected !!