News January 23, 2025
భూంపల్లి: ఇంటి నుంచి వెళ్లి చెరువులో శవమయ్యాడు

ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి చెరువులో శవమై తేలాడు. SI హరీష్ గౌడ్ తెలిపిన వివరాలు.. అక్బర్పేట్ భూంపల్లి మండలం చిన్ననిజాంపేటకు చెందిన రంజిత్(33) మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తిరిగి రాలేదు. దీనిపై కుటుంబీకులు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొతారెడ్డిపేట పెద్ద చెరువు వద్ద ఉన్న బైక్, ఫొన్ ఆధారంగా గాలించగా చెరువులో మృతదేహం దొరికింది. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News December 5, 2025
పోస్టల్ బ్యాలెట్ అందజేయాలి: అదనపు కలెక్టర్ నగేష్

పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా ఓటింగ్ సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశమై, వారికి కేటాయించిన విధులను సమర్థంగా నిర్వహించేందుకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.
News December 5, 2025
‘కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో ఉంచాలి’

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలకు అనుగుణంగా లారీలు అందుబాటులో ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. బోయినపల్లి, కోనరావుపేట మండలాలకు చెందిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లారీల కాంట్రాక్టర్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు, నిల్వలపై అదనపు కలెక్టర్ ఆరా తీశారు.
News December 5, 2025
విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యం: కలెక్టర్

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అనుసంధానాన్ని బలోపేతం చేసి విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెగా పీటీఎం-3.0 విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం అమలాపురం మండలం పితాని వారి పాలెం ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించారు.


